పవన్ భార్యపై విమర్శలు.. రంగంలోకి దిగి సీరియస్ అయిన విజయశాంతి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారి దర్శనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సింగపూర్ అగ్ని ప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా భయటపడడంతో భారత్ వచ్చిన వెంటనే ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. తన తలనీలాలను వెంకన్నకు సమర్పించుకున్నారు.
క్రిస్టియన్ అయినా అన్నా లెజినోవా ఆలయ నియమ నిబంధనలు పాటిస్తూ డిక్లరేషన్ ఇచ్చి.. హిందూ సంప్రదాయాలు, ఆచారాలను పాటిస్తూ శ్రీవారికి మొక్కు చెల్లించుకున్నారు. తన కొడుకు పేరుమీద నిత్యాన్నాదనం కోసం రూ.17 లక్షల విరాళాన్ని అందజేశారు. అంతేకాకుండా భక్తులతో కలిసి నిత్యాన్నాదనంలో పాల్గొన్నారు. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం అన్నా లెజినోవా తీరుపై నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. క్రిస్టియన్ అయి ఉండి తిరుమలకు రావడం ఏంటీ.. ? తలనీలాలు ఇవ్వడం ఏంటీ ? అంటూ కొందరు సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శిస్తున్నారు. ఆ క్రమంలోనే… అన్నా లెజినోవాను విమర్శిస్తున్న వారిపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సీనియర్ హీరోయిన్ విజయశాంతి సీరియస్ అయ్యారు. ట్రోల్స్ చేస్తున్న వారిపై తన అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికపై తరుచుగా సమకాలని అంశాలపై… వార్తలపై స్పందించే ఈమె… తాజాగా అన్నా లెజినోవాను ప్రశంసిస్తూ.. ట్వీట్ చేశారు. దాంతో పాటే అన్నాను ట్రోల్స్ చేసిన వారిపై అసహనం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బట్టలిప్పి నా ముందు నిలుచో.. హీరోయిన్కు సెట్లోనే స్టార్ హీరో వేధింపులు
30 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. వరుడి వయసెంతో తెలుసా ??
విక్రమ్ కొడుకుకు అనుపమ లిప్ కిస్! లీకైన ఫోటోతో.. క్రేజీ టాక్
Prabhas: ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. ప్రభాస్ ఎమోషనల్ వీడియో
మూడేళ్లుగా ప్రతి రోజూ నెలసరి.. కారణం తెలిసి ఖంగుతిన్న వైద్యులు
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

