AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan - Chiranjeevi: తండ్రికి అత్యుత్తమ అవార్డ్‌.! చెర్రీ భావోద్వేగ మెసేజ్‌.

Ram Charan – Chiranjeevi: తండ్రికి అత్యుత్తమ అవార్డ్‌.! చెర్రీ భావోద్వేగ మెసేజ్‌.

Anil kumar poka
|

Updated on: Jan 27, 2024 | 12:05 PM

Share

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అనౌన్స్ చేసింది. అయితే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని సత్కరించింది కేంద్రం. దీంతో మెగాస్టార్ చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అనౌన్స్ చేసింది. అయితే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని సత్కరించింది కేంద్రం. దీంతో మెగాస్టార్ చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా చిరు తనయుడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌.. రియాక్టచయ్యారు. ఎమోషనల్ ట్వీట్ చేశారు.

ఇంతకీ రామ్ చరణ్ ఏం ట్వీట్ చేశారంటే… “ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైనందుకు ధన్యవాదాలు, భారతీయ సినీ పరిశ్రమ, సమాజానికి మీరందించిన సేవలు.. నాతోపాటు ఎంతోమంది అభిమానులను ప్రేరేపించడంలో కీలకపాత్ర పోషించాయి. ఈ గొప్ప దేశంలో మీరొక అద్భుతమైన పౌరుడు. మీ సేవలను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి.. ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు. ఈ ప్రయాణంలో అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు” అని చరణ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos