విజయేంద్రప్రసాద్ కలం నుంచి మరో భారీ సినిమా! రాజమౌళే దర్శకత్వం వహిస్తారా?
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న ఎస్ ఎస్ ఎమ్ బీ 29 వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాపై ఓ వీడియోను అప్లోడ్ చేసిన రాజమౌళి.. సింహాన్ని బోనులో పెట్టి పాస్పోర్ట్ లాక్కున్నట్లు పరోక్షంగా చెప్పాడు.
అలా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని హింట్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే రాజమౌళి తదుపరి సినిమా గురించి ఆయన తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ దిమ్మతిరిగే హింట్ ఇచ్చాడు. భారతదేశంలోని అత్యుత్తమ కథా రచయితలలో విజయేంద్రప్రసాద్ ఒకరు. ఇప్పటి వరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ మినహా మిగిలిన అన్ని సినిమాలకు విజయేంద్రప్రసాదే కథ అందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రాజమౌళి తదుపరి సినిమా గురించి చెప్పారు. విజయేంద్రప్రసాద్ సీత గురించి ఓ కథ రాసుకున్నారట. మొత్తం రామాయణాన్ని సీత కోణంలో చూపించాలన్నది ఆయన ప్రయత్నం. కోట్లాది రూపాయల బడ్జెట్తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా తెరకెక్కించాలన్నది విజయేంద్ర ప్రసాద్ ప్లాన్ అట. అయితే ఆ సినిమాను రాజమౌళి స్వయంగా డైరెక్ట్ చేస్తారా.. లేక మరెవరైనా డైరెక్ట్ చేస్తారా అనేది ఇంకా బయటకు రాలేదు. రాజమౌళి దర్శకత్వం వహించాలంటే కనీసం నాలుగేళ్లు అయినా ఆగాల్సిందే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

