విజయేంద్రప్రసాద్ కలం నుంచి మరో భారీ సినిమా! రాజమౌళే దర్శకత్వం వహిస్తారా?
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న ఎస్ ఎస్ ఎమ్ బీ 29 వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాపై ఓ వీడియోను అప్లోడ్ చేసిన రాజమౌళి.. సింహాన్ని బోనులో పెట్టి పాస్పోర్ట్ లాక్కున్నట్లు పరోక్షంగా చెప్పాడు.
అలా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని హింట్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే రాజమౌళి తదుపరి సినిమా గురించి ఆయన తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ దిమ్మతిరిగే హింట్ ఇచ్చాడు. భారతదేశంలోని అత్యుత్తమ కథా రచయితలలో విజయేంద్రప్రసాద్ ఒకరు. ఇప్పటి వరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ మినహా మిగిలిన అన్ని సినిమాలకు విజయేంద్రప్రసాదే కథ అందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రాజమౌళి తదుపరి సినిమా గురించి చెప్పారు. విజయేంద్రప్రసాద్ సీత గురించి ఓ కథ రాసుకున్నారట. మొత్తం రామాయణాన్ని సీత కోణంలో చూపించాలన్నది ఆయన ప్రయత్నం. కోట్లాది రూపాయల బడ్జెట్తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా తెరకెక్కించాలన్నది విజయేంద్ర ప్రసాద్ ప్లాన్ అట. అయితే ఆ సినిమాను రాజమౌళి స్వయంగా డైరెక్ట్ చేస్తారా.. లేక మరెవరైనా డైరెక్ట్ చేస్తారా అనేది ఇంకా బయటకు రాలేదు. రాజమౌళి దర్శకత్వం వహించాలంటే కనీసం నాలుగేళ్లు అయినా ఆగాల్సిందే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

