Prabhas: ప్రభాస్ దెబ్బకు అరవ హీరో సైలెంట్ అవుతాడా?
నిన్న మొన్నటి వరకు డైలామాలో ఉన్న రాజాసాబ్ ఫ్యాన్స్ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. రాజా సాబ్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ అనౌన్స్మెంట్ నేపథ్యంలో తమ స్టార్ హీరో దెబ్బకి అరవ హీరో విజయ్ దళపతి సైలెంట్ అవ్వాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు. తమ ఆదిపత్యాన్ని తమ కామెంట్స్ రూపంలో సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు.
ఇక మారుతీ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ రాజాసాబ్..! ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా ఎట్టకేలకు జనవరి 9న రిలీజ్ అవుతుందని ఈ మూవీ ప్రొడ్యూసర్ రీసెంట్గా అనౌన్స్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ అయ్యేలా చేశాడు. అయితే హెచ్ వినోడ్ డైరెక్షన్లో విజయ్ దళపతి చేస్తున్న లాస్ట్ ఫిల్మ్ .. జననాయగన్ కూడా జనవరి 9న రిలీజ్ అవుతోంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర విజయ్ దళపతి.. ప్రభాస్ మధ్య బిగ్ ఫైట్ జరిగేలా ఉంది. ఈక్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ ..కాస్త యాక్టివ్ అయ్యారు. టాలీవుడ్ లో తమ హీరోను కొట్టేంత సీన్ తళపతికి లేదంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు కోలీవుడ్ మినహా రిమైనింగ్ పాన్ ఇండియా ఇండస్ట్రీస్లోనూ తమ హీరోదే పై చేయి సాధిస్తాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్ ఫిల్మ్ అనలిస్టులు కూడా దాదాపు ఇదే చెబుతున్నారు. ఈ సారి టాలీవుడ్ గడ్డపై ప్రభాస్ దెబ్బకు అరవహీరో సైలెంట్ అవడ పక్కా అని చెబుతున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్టాప్లు పేలుతున్నాయ్గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

