తన అభిమాన హీరోకు రూ.72 కోట్ల ఆస్తిని రాసిచ్చిన వీరాభిమాని వీడియో
సినీ హీరోలకు అభిమానులు కోట్లలో ఉంటారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే వారి హడావిడి అంతా ఇంతా కాదు. థియేటర్ల దగ్గర భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తారు. పాలాభిషేకాలు చేస్తారు. ఇదొకరకమైన అభిమానం అయితే.. కొందరు తమ కుటుంబ సభ్యులకంటే కూడా ఎక్కువగా ఈ హీరోలను అభిమానిస్తుంటారు. కానీ, తాను అభిమానించే హీరోకు ఏకంగా కోట్ల రూపాయల విలువైన ఆస్తులను రాసివ్వడం ఎప్పుడైనా విన్నారా...? అవును ఓ అభిమాని తన అభిమాన హీరోకి ఏకంగా కోట్ల విలువైన ఆస్తిని రాసిచ్చారు. విషయం తెలిసిన ఆ హీరో చలించిపోయారు.
ముంబైకి చెందిన నిషా పాటిల్ కు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అంటే విపరీతమైన అభిమానం. తొలి నుంచి కూడా ఆయనను ఎంతగానో అభిమానిస్తోంది. ఆయన ప్రతి సినిమాను లెక్కలేనన్ని సార్లు చూసింది. ఇటీవలే ఆమె కన్నుమూసింది. ఆమె వయసు 62 సంవత్సరాలు కాగా… ఆమె పేరిట దాదాపు రూ. 72 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. తనకు చివరి రోజులు దగ్గర పడుతున్నాయనే విషయాన్ని గ్రహించిన నిషా పాటిల్.. 2018లోనే తన ఆస్తి, బ్యాంకు అకౌంట్లలో ఉన్న డబ్బు సంజయ్ దత్ కు చెందేలా వీలునామా రాయించింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె వీలునామా దస్తావేజులు సంజయ్ దత్ ఇంటికి వచ్చాయి. విషయం తెలిసిన సంజయ్ దత్ షాక్ కు గురయ్యారు. పరిచయం లేని వ్యక్తి ఆస్తి రాసివ్వడం చూసి ఆయన చలించిపోయారు. అయితే ఆ ఆస్తిని సంజయ్ దత్ తీసుకోలేదు. ఆ ఆస్తి తిరిగి ఆమె కుటుంబానికి చెందేలా చూడాలని తన లీగల్ టీమ్ కు సూచించారు. ఇంత గొప్ప అభిమానిని కలవలేకపోవడం బాధగా ఉందని చెప్పారు. కనీసం ఆమె కుటుంబ సభ్యులనైనా కలిసి కొంత ఊరట చెందుతానని అన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇది వింటేనే షాకవుతారు!ఒక నెల మొబైల్ రీఛార్జ్ ధర రూ.50,000!వీడియో
ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. రూ.8.5లక్షల కోట్లతో..
కూరలు కట్ చేసే చాపింగ్ బోర్డుతో భయంకర వ్యాధులు.. మరి ఏది వాడాలి?
రాత్రయితే చాలు ఆ ప్రాంతంలో రాళ్ల వర్షం.. అంతు చిక్కని మిస్టరీ వీడియో
చిక్కుల్లో ధురంధర్ స్టార్.. రణవీర్ సింగ్ కు షాక్ ఇచ్చిన నిర్మా
సీబీఐ అధికారులమంటూ ఫోన్.. కట్ చేస్తే కటకటాల్లోకి
అమెరికాలో మెరిసిన మన కశ్మీరీల ప్రతిభ !!
పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్ ఆలోచన
ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు..
జ్యువెలరీ షాపులో భారీ చోరీ.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
అరణ్యాలు దాటి హైవేపై ప్రత్యక్షమవుతున్న పులులు, సింహాలు..

