ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. రూ.8.5లక్షల కోట్లతో..
ప్రపంచ కుబేరుడు, ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ ఓపెన్ఏఐ పై ఫోకస్ పెట్టారు. కొంతకాలంగా మస్క్ ఈ కంపెనీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటిది తాజాగా మస్క్ ఓపెన్ ఏఐని కొనుగోలు చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. ఇందుకోసం ఓ భారీ ఆఫర్ కూడా ప్రకటించారు. ఓపెన్ఏఐ ని 97.4 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.8.5లక్షల కోట్లకు కొనుగోలు చేస్తామంటూ మస్క్ సహా మరికొందరు ఇన్వెస్టర్లు ప్రకటించారు.
అయితే ఈ ఆఫర్ను ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ బహిరంగంగానే తిరస్కరించారు. దానికి ప్రతిగా అవసరమైతే ‘ఎక్స్’నే కొనుగోలు చేస్తానంటూ మస్క్కు సవాల్ విసిరారు. ‘‘మీ ఆఫర్కు నో. కానీ, మీరు కోరుకుంటే ట్విటర్ను 9.74 బిలియన్ డాలర్లకు అంటే దాదాపు రూ.85వేల కోట్లకు మేమేకొనుగోలు చేస్తాం’’ అంటూ ఆల్ట్మన్ తన ‘ఎక్స్’ ఖాతాలో రాసుకొచ్చారు.
Follow Us
వైరల్ వీడియోలు
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
మహానగరంలో మ్యాట్రిమోనీ మాయగాడు
త్వరలో నన్ను కూడా చంపేస్తారేమో!
నేను మద్యం సేవించి పోలీస్టేషన్కు రాలేదు!
మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరిట కోట్లాది రూపాయలకు కుచ్చుటోపీ
తెలుగురాష్ట్రాల్లో భానుడి భగభగలు.. నిప్పులగుండంలా విజయవాడ, వరంగల్
ఇంట్లో కూతురి శవంతో తండ్రి.. దుర్వాసన రాకుండా సెంట్లు

