ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. రూ.8.5లక్షల కోట్లతో..
ప్రపంచ కుబేరుడు, ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ ఓపెన్ఏఐ పై ఫోకస్ పెట్టారు. కొంతకాలంగా మస్క్ ఈ కంపెనీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటిది తాజాగా మస్క్ ఓపెన్ ఏఐని కొనుగోలు చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. ఇందుకోసం ఓ భారీ ఆఫర్ కూడా ప్రకటించారు. ఓపెన్ఏఐ ని 97.4 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.8.5లక్షల కోట్లకు కొనుగోలు చేస్తామంటూ మస్క్ సహా మరికొందరు ఇన్వెస్టర్లు ప్రకటించారు.
అయితే ఈ ఆఫర్ను ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ బహిరంగంగానే తిరస్కరించారు. దానికి ప్రతిగా అవసరమైతే ‘ఎక్స్’నే కొనుగోలు చేస్తానంటూ మస్క్కు సవాల్ విసిరారు. ‘‘మీ ఆఫర్కు నో. కానీ, మీరు కోరుకుంటే ట్విటర్ను 9.74 బిలియన్ డాలర్లకు అంటే దాదాపు రూ.85వేల కోట్లకు మేమేకొనుగోలు చేస్తాం’’ అంటూ ఆల్ట్మన్ తన ‘ఎక్స్’ ఖాతాలో రాసుకొచ్చారు.
వైరల్ వీడియోలు
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
