ఈ సంక్రాంతికి డబుల్ బొనాంజా.. అనిల్ రావిపూడి ధీమా
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడిల 'మన శంకర వరప్రసాద్ గారు' 2026 సంక్రాంతికి విడుదల కానుంది. చిరంజీవి 20 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో తిరిగి వస్తున్నారని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సంక్రాంతి డబుల్ బొనాంజా అవుతుందని, నయనతార, వెంకటేశ్ పాత్రలు ఆకర్షణగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. సినిమాపై భారీ అంచనాలున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. 2026లో సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సంక్రాంతికి డబుల్ బొనాంజా ఉంటుందని, చిరంజీవిని ప్రేక్షకులు ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న పాత్రలో చూస్తారని అన్నారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి .. చిరంజీవి గారు పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటించి దాదాపు 20 ఏళ్లు దాటింది. ఇది ఆయనకు ఎంతో నచ్చిన జానర్. గతంలో ఇలాంటి కథలతో ఆయన ఎన్ని బ్లాక్బస్టర్లు సాధించారో మనందరికీ తెలుసు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే జానర్తో వస్తున్నారు. ఈ సినిమాతో చిరంజీవి గారు అందరినీ సర్ప్రైజ్ చేయడం ఖాయం అని తెలిపారు. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ పాటకు అద్భుతమైన స్పందన వచ్చిందని, త్వరలోనే మరో పాటను విడుదల చేస్తామని చెప్పారు. షూటింగ్ పూర్తి కాగానే ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తామని అనిల్ రావిపూడి వివరించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, ప్రముఖ నటుడు వెంకటేశ్ అతిథి పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యాప్ల వినియోగంపై కేంద్రం కొత్త రూల్
Janhvi Kapoor: ‘నా తల్లి మరణంపై తప్పుడు ప్రచారం చేశారు’ జాన్వీకపూర్ ఎమోషనల్ !!
సూర్య కాంతాన్ని మించేస్తున్న తనూజ కాతం !! పాపం బిగ్ బాస్
షాజహాన్ – ముంతాజ్ మెచ్చిన రింగ్తో నిశ్చితార్థం !! సమంత ఆలోచన వెరీ స్పెషల్
కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ !! గురువేమో నామినేషన్స్లో..శిష్యుడు డేంజర్ జోన్ లో
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

