AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajesh Khanna: వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన్నా లివ్‌ ఇన్‌ పార్ట్‌నర్ అనితా అద్వానీ.

Rajesh Khanna: వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన్నా లివ్‌ ఇన్‌ పార్ట్‌నర్ అనితా అద్వానీ.

Anil kumar poka
|

Updated on: Jan 02, 2025 | 6:53 PM

Share

హిందీ చిత్రపరిశ్రమలో తొలి సూపర్‌స్టార్‌గా ఓ వెలుగు వెలిగారు రాజేష్‌ఖన్నా. ఆకర్షించే అందం, అద్భుత అభినయంతో పాటు వ్యక్తిగత వివాదాలతోనూ ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉండేవారు. చనిపోయి 12 ఏళ్లు గడుస్తున్నా.. వ్యక్తిగత జీవితం, ఆస్తి తగాదాలతో మళ్లీ బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది రాజేష్‌ఖన్నా పేరు.

2012లో చనిపోయే ముందు వీలునామాలో తన ఆస్తి మొత్తాన్ని భార్య డింపుల్ కపాడియాను మినహాయించి కుమార్తెలు ట్వింకిల్, రింకీలకు పంచిపెట్టడంపై.. పుష్కర కాలం గడిచాక రాజేష్‌ఖన్నా లివింగ్ పార్ట్‌నర్, నటి అనితా అద్వానీ కోర్టుమెట్లెక్కారు. 10 ఏళ్లకు పైగా రాజేష్ ఖన్నా బాగోగులు చూసుకున్నందుకు చట్టపరమైన పరిహారం అందించాలని ఇప్పుడు కోరడం వివాదానికి దారి తీసింది. 1969-71 మధ్య వరసగా 15 బ్లాక్‌బస్టర్‌లతో భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేశారు రాజేష్‌ఖన్నా. సన్నిహితులు ఆయనని ప్రేమగా కాకా అని పిలిచేవారు. విపరీతమైన ఫ్యాన్‌ఫాలోయింగ్‌తో బాలీవుడ్ తొలి సూపర్‌స్టార్‌గా ఖ్యాతికెక్కిన ఖన్నా.. వృత్తిపరంగా, వ్యక్తిగత వివాదాలతోనూ సంచలనం సృష్టించారు. 15 ఏళ్లు చిన్నదైన డింపుల్ కపాడియాను పెళ్లి చేసుకోవడం అప్పట్లో ఓ సంచలనం. పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే స్టార్‌‌డమ్ అందుకున్న ఈ బాలీవుడ్ సూపర్‌స్టార్‌.. తర్వాత వరస ఫ్లాపులు, వ్యక్తిగత వివాదాలతో పతనమవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. చివరిదశలో నటి అనితా అద్వానీతో సహజీవనం చేయడం చాలా మందికి తెలిసిందే.

2012లో మరణానికి ఒక నెల ముందు తన ఐకానిక్ బంగ్లా, ఇతర ఆస్తులను కుమార్తెలు ట్వింకిల్, రింకీల పేరిట వీలునామాలో రాశారు రాజేష్‌ఖన్న. ఇందులో భార్య డింపుల్ కపాడియా, లివింగ్ పార్ట్‌నర్ అనితా అద్వానీల పేరు చేర్చలేదు. అయినా, అప్పట్లో ఈ విషయంపై ఎక్కడా మాట్లడలేదు అనిత. కానీ, దాదాపు 12 ఏళ్లు గడిచాక తన హక్కులను క్లెయిమ్ చేస్తూ అతడి కుటుంబానికి లీగల్ నోటీసులు పంపించడం బీటౌన్‌లో ప్రకంపనలు పుట్టించింది. జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనితా అద్వానీ చాలా విషయాలు చెప్పారు. రాజేష్‌ఖన్నాపై ప్రేమతో ఒంటరిగా జీవిస్తున్న ఆయనకు చివరి దశ వరకూ తోడుగా ఉండి బాగోగులు చూసుకున్నాననీ అన్నారు. అంత్యక్రియల సమయంలో రాజేష్ కుటుంబం దూరంగా పెట్టినా, డబ్బు పరంగా ఎలాంటి సాయం అందకపోయినా అప్పట్లో పట్టించుకోలేదనీ చెప్పారు. ఆశీర్వాద్ బంగ్లాను మ్యూజియంగా మార్చాలనేది ఆయన కల అనీ.. ఈ విషయం పక్కనపెట్టినందుకే ఎస్టేట్ హక్కుల కోసం ఆయన కుటుంబానికి 12 ఏళ్ల తర్వాత లీగల్ నోటీసులు పంపాననీ అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.