AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మఠానికి రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చిన స్టార్ హీరో.. ధర ఎంతో తెలుసా?

మఠానికి రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చిన స్టార్ హీరో.. ధర ఎంతో తెలుసా?

Phani CH
|

Updated on: Feb 25, 2025 | 4:38 PM

Share

కర్ణాటకలోని చన్నగిరి తాలూకాలోని ధావణగేరే శిలామఠం లోకి ఒక రోబోటిక్ ఏనుగు వచ్చింది . ఫిబ్రవరి 24న శ్రీ మఠానికి చేరుకున్న ఏనుగుకు స్వామీజీ ఘన స్వాగతం పలికారు. ఆ రోబోటిక్ ఏనుగుకు ఉమామహేశ్వర్ అని పేరు పెట్టారు. గ్రామస్తులందరూ మేళ తాళాలతో రోబోటిక్ ఏనుగును ఊరేగించారు.

ఇక భక్తులు, స్థానికులు రోబోటిక్ ఏనుగు పక్కన నిలబడి ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చారు. ఈ ఏనుగును తయారు చేయించేందుకు భారీగానే ఖర్చు కూడా పెట్టారు. ముంబైకి చెందిన కుపా & పెటా ఇండియా సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఈ ఏనుగును మఠానికి అందించారు. ఈ ఫౌండేషన్ నుంచి ఇప్పటికే పలు ఆలయాలు, మఠాలకు రోబోటిక్ ఏనుగులు చేరాయి. థాకర్సే సంస్థ ఇందుకు నిధులు సమకూరుస్తోంది. ఒక రోబోటిక్ ఏనుగు ధర సుమారు 17 లక్షల రూపాయలని తెలుస్తోంది. ఏనుగును ట్రాలీపై ఉంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. రిమోట్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేస్తుంటారు. అంటే కళ్లు మూసుకోవడం, చెవులు ఊపడం, తొండంతో భక్తులను ఆశీర్వదించడం.. ఇలా అన్ని రిమోట్ కంట్రోల్ ద్వారానే జరుగుతాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిరంజీవి, సుకుమార్ పై అంబటి చీప్‌ కామెంట్స్! ఫ్యాన్స్ ఫైర్

TOP 9 ET News: స్టేడియంలో చిరంజీవి, సుకుమార్.అంబటి చీప్‌ కామెంట్స్