Nayanthara: నయన్ జీవితంలో ఏదో జరుగుతోంది.. అందుకే ఆ పోస్ట్ చేసిందా ??

సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా దూసుకుపోతుంది నయనతార. తెలుగు తమిళ్ తో పాటు ఇటీవల హిందీలోనూ సత్తా చాటింది నయన్. అయితే ఈ బ్యూటీ వ్యక్తిగత కారణాలతో ఈ మధ్య వార్తల్లో నిలుస్తోంది. నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్‌ మధ్య మనస్పర్థలు తలెత్తాయని.. త్వరలోనే వీరు విడిపోతారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడమే ఇందుకు కారణం.

Nayanthara: నయన్ జీవితంలో ఏదో జరుగుతోంది.. అందుకే ఆ పోస్ట్ చేసిందా ??

|

Updated on: Mar 08, 2024 | 5:58 PM

సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా దూసుకుపోతుంది నయనతార. తెలుగు తమిళ్ తో పాటు ఇటీవల హిందీలోనూ సత్తా చాటింది నయన్. అయితే ఈ బ్యూటీ వ్యక్తిగత కారణాలతో ఈ మధ్య వార్తల్లో నిలుస్తోంది. నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్‌ మధ్య మనస్పర్థలు తలెత్తాయని.. త్వరలోనే వీరు విడిపోతారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడమే ఇందుకు కారణం. ఆ తర్వాత మళ్లీ విఘ్నేష్‌ని ఫాలో చేయడం మొదలు పెట్టింది. కానీ ఈ గ్యాప్ లోనే ఈ ఇద్దరు విడిపోతున్నారంటూ వార్తలు సుడిగాలిలా చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి నయనతార చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నయన తార జీవితంలో ఏదో జరగుతోందని అందరూ అనుకునేలా చేస్తోంది. విఘ్నేష్ శివన్, నయనతార జూన్ 9, 2022 న వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ సంతోషంగా జీవిస్తూవస్తున్నారు. అయితే తాజాగా వీరి మధ్య సఖ్యత లోపించిందని టాక్ వినిపిస్తోంది. నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో ‘ఐయామ్ లాస్ట్’ అని పోస్ట్ చేసింది. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. నయనతార మిస్టరీగా చేసిన పోస్ట్‌కి అర్థం ఏమిటని అభిమానులు ఆలోచిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sharwanand: తండ్రిని అయ్యా.. అందరికీ స్వీట్‌ షాకిచ్చిన శర్వా..

Gaami: గామి మూవీ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే వీడియో చూసేయండి

 

Follow us