AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WITT Satta Sammelan: బీసీ గణనపై రాహుల్ గాంధీకి అవగాహన లేదు.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్..

లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. మళ్లీ మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈసారి మళ్లీ నరేంద్ర మోదీనే ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రచారం చేస్తోంది. ఈ తరుణంలో దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే కాన్క్లేవ్‌లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ.. అంటే గ్యారెంటీ అంటూ స్పష్టమైన సమాధానం ఇచ్చారు.

Shaik Madar Saheb
|

Updated on: Feb 27, 2024 | 8:49 PM

Share

లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. మళ్లీ మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈసారి మళ్లీ నరేంద్ర మోదీనే ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రచారం చేస్తోంది. ఈ తరుణంలో దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే కాన్క్లేవ్‌లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ.. అంటే గ్యారెంటీ అంటూ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. వాట్ ఇండియా టుడే కాన్క్లేవ్‌లో మూడో రోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌.. మాట్లాడుతూ.. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు దాటడమే తమ లక్ష్యమన్నారు. అంతేకాకుండా ప్రజలు కూడా ఈ లక్ష్యాన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నారన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రతిసారీ ప్రధాని మోదీ పేరుతో ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తుందని కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ, “మా పార్టీ నాగరికతను చూడండి. రామాయణంలో రాముడు ప్రధాన పాత్ర అని ఎందుకు చెబుతారు? హాభారతంలోని ప్రధాన పాత్ర శ్రీకృష్ణుడు, అర్జునుడు మాత్రమే ఎందుకు? సంఘటనల ఏదైనా ప్రవాహంలో ఒక ప్రధాన పాత్ర ఉంటుంది. ఎవరూ ప్రధాన పాత్రలు కాదు. అలాగే ప్రధాని మోదీ కూడా.. అంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా బీసీ గణనపై కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.. కుల గణనపై రాహుల్ గాంధీకి అవగాహన లేదన్నారు.

భారత్ ఆలోచనలు, ఆకాంక్షలను టీవీ9 శిఖరాగ్ర సదస్సు Live కోసం ఇక్కడ క్లిక్ చేయండి…