Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garib Rath Express: రంగు మారనున్న గరీబ్‌ రథ్‌.. మరిన్ని సౌకర్యాలు కూడా

Garib Rath Express: రంగు మారనున్న గరీబ్‌ రథ్‌.. మరిన్ని సౌకర్యాలు కూడా

Phani CH

|

Updated on: Apr 08, 2024 | 9:33 PM

ఇటీవల రైల్వేలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వందేభారత్‌ రైళ్ల పేరుతో అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో బుల్లెట్‌ రైలు కూడా అందుబాటులోకి రానుంది. ఇటీవలే వందేభారత్‌ రైలు రంగు మారుతుందనే వార్తలు వచ్చాయి. వందేభారత్‌ రైలు రంగు మారుతుందో లేదో తెలియదు కానీ తాజాగా మొత్తం ఏసీ కోచ్‌లతో నడిచే గరీబ్‌రథ్‌ రైలు రంగు మాత్రం కచ్చితంగా మారబోతోంది.

ఇటీవల రైల్వేలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వందేభారత్‌ రైళ్ల పేరుతో అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో బుల్లెట్‌ రైలు కూడా అందుబాటులోకి రానుంది. ఇటీవలే వందేభారత్‌ రైలు రంగు మారుతుందనే వార్తలు వచ్చాయి. వందేభారత్‌ రైలు రంగు మారుతుందో లేదో తెలియదు కానీ తాజాగా మొత్తం ఏసీ కోచ్‌లతో నడిచే గరీబ్‌రథ్‌ రైలు రంగు మాత్రం కచ్చితంగా మారబోతోంది. ఇప్పటివరకూ గ్రీన్‌ కలర్‌లో ఉన్న ఈ రైలు ఇప్పుడు ఎరుపురంగులోకి మారబోతోంది. అందరికీ ఏసీ కోచ్‌లలో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో రైల్వేశాఖ గరీబ్ రథ్ రైలును ప్రారంభించింది. ఇప్పుడు ఈ రైలులో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బోగీల సంఖ్యను పెంచడంతోపాటు, రంగు కూడా మార్చనున్నారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ గరీబ్ రథ్‌లో చోటుచేసుకోబోయే మార్పులను తెలియజేశారు. బీహార్‌కు అనుసంధానమైన అన్ని గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లలో సీట్ల సంఖ్యను పెంచనున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎన్నికల్లో ‘గ్యాస్​’ బాయ్ పోటీ..పేదల కోసమే మరోసారి బరిలోకి

తేనె ఎప్పుడు తీసుకోవాలో తెలుసా ?? ఆ సమయంలో సేవిస్తే తిరుగుండదట