ఇక.. ఈపీఎఫ్ కనీస పింఛన్ రూ. 2500.. ఆ రోజే నిర్ణయం
ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ చందాదారులకు త్వరలో శుభవార్త రానుంది. కనీస పింఛను పెంపుకోసం పదకొండేళ్లుగా చూస్తున్న ఎదురుచూపులకు తెరపడనుంది. ఈ పింఛను పెంపుపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇస్తున్న కనీస పింఛను మొత్తాన్ని గణనీయంగా పెంచేందుకు కసరత్తు జరుగుతోంది.
ప్రస్తుతం ఉద్యోగుల పింఛను పథకం ఈపీఎస్-95 కింద నెలకు రూ. 1000 కనీస పింఛను అందుతోంది. 2014లో నిర్ణయించిన ఈ మొత్తంలో ఇప్పటివరకు ఎలాంటి మార్పు లేదు. అయితే, తాజాగా ఈ కనీస పింఛనును రూ. 2500కు పెంచేందుకు ఈపీఎఫ్ఓ సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు, ఉద్యోగ సంఘాలు మాత్రం పింఛనును నెలకు రూ. 7500కు పెంచాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నెల 10, 11 తేదీల్లో బెంగళూరులో జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో ఈ అంశం ప్రధాన ఎజెండాగా చర్చకు రానుంది. పింఛను పెంపుతో పాటు సంస్థ సేవలను డిజిటలైజ్ చేసే ‘ఈపీఎఫ్ఓ 3.0’ విధానం, ఇతర పరిపాలనా సంస్కరణలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. బెంగళూరు సమావేశంలో పింఛను పెంపునకు బోర్డు ఆమోదం తెలిపితే, తుది నిర్ణయం కోసం ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. కేంద్రం ఆమోద ముద్ర వేసిన తర్వాతే కొత్త పింఛను అమల్లోకి వస్తుంది. కాగా, కనీసం పదేళ్ల సర్వీసు పూర్తిచేసి 58 ఏళ్లు నిండిన ఉద్యోగులు ఈపీఎస్-95 కింద పింఛను పొందేందుకు అర్హులన్న విషయం తెలిసిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Today Gold Price: బంగారం ధరలు ఆగేదెప్పుడు ?? తులం ఎంతంటే ??
Thalapathy Vijay: ఓదార్పు యాత్ర చేయాలి.. పర్మిషన్ ప్లీజ్
గ్యాస్ సిలిండర్ల లారీని ఢీకొన్న పాల ట్యాంకర్.. తర్వాత
గాజుల షాపులో నాగుపాము.. కస్టమర్ల పరుగో పరుగు
బట్టలుతుకుతున్న మహిళ.. హఠాత్తుగా మొసలి ఎంట్రీ.. ఆమెను నదిలోకి లాక్కెళ్లి
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

