AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బదిలీపై వచ్చిన తహశీల్దారు.. మొదటిరోజే దారుణం..

బదిలీపై వచ్చిన తహశీల్దారు.. మొదటిరోజే దారుణం..

Phani CH
|

Updated on: Feb 04, 2024 | 8:48 PM

Share

విశాఖ జిల్లా కొమ్మాదిలో దారుణం జరిగింది. విజయనగరం జిల్లా కొండపల్లి తహశీల్దార్‌ రమణయ్యను దుండగులు చంపేశారు. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఐరన్ రాడ్లతో రమణయ్యపై దాడి చేశారు. వాచ్‌మన్‌ కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రగాయాలైన తహశీల్దార్‌ రమణయ్య అక్కడికక్కడే కుప్పకూలారు. అప్రమత్తమైన సిబ్బంది తహశీల్దార్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమణయ్య మృతిచెందాడు.

విశాఖ జిల్లా కొమ్మాదిలో దారుణం జరిగింది. విజయనగరం జిల్లా కొండపల్లి తహశీల్దార్‌ రమణయ్యను దుండగులు చంపేశారు. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఐరన్ రాడ్లతో రమణయ్యపై దాడి చేశారు. వాచ్‌మన్‌ కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రగాయాలైన తహశీల్దార్‌ రమణయ్య అక్కడికక్కడే కుప్పకూలారు. అప్రమత్తమైన సిబ్బంది తహశీల్దార్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమణయ్య మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని విశాఖ సీపీ రవిశంకర్‌ పరిశీలించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. విశాఖ రూరల్ ఎమ్మార్వో గా పనిచేస్తూ మూడు రోజుల క్రితం విజయనగరం జిల్లా కొండపల్లికి బదిలీపై వచ్చారు రమణయ్య. శుక్రవారం కొండపల్లి ఎమ్మార్వోగా బాధ్యతలు స్వీకరించారు. విధులు ముగించుకుని సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో రమణయ్యకు ఫోన్‌ రావడంతో తను ఉంటున్న అపార్ట్‌మెంట్లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌కు చేరుకున్నారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఆయనతో మాట్లాడి వెళ్లారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మద్యం వ్యాపారి వినూత్న ఆలోచన.. ఏం చేశాడంటే ??

10 రోజుల్లో బాలరాముడి ఆదాయం ఎంతో తెలుసా ??

ఇళ్ల ముందు కర్రలతో మహిళల గస్తీ .. ఎందుకంటే ??

మీ డబ్బు భద్రంగానే ఉంది.. కస్టమర్లకు పేటీఎం భరోసా

అశ్లీల వీడియోలకు అలవాటు పడ్డ.. కుమారుడికి పెద్ద శిక్ష వేసిన తండ్రి