తెల్లవారితే ఊరంతా పండుగ.. ఈలోపే బోరుమన్న గ్రామస్థులు..
దుర్గమ్మ పండుగకు సిద్ధం చేస్తున్న ఆ ఊరు బోరుమంది. విద్యుత్ షాక్కు గురై ముగ్గురు మృతి చెందగా మరోవ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాద సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యతండాలో జరిగింది. కొంతమంది యువకులు దుర్గమ్మ పండుగకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో 11 కే.వీ విద్యుత్ వైర్ తెగి వారి మీద పడింది. ఓ బాలుడితో సహా నలుగురు వ్యక్తులు విద్యుత్ షాక్కు గురయ్యారు. భూక్యా దేవేందర్, అనిల్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రవి అనేవ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.
దుర్గమ్మ పండుగకు సిద్ధం చేస్తున్న ఆ ఊరు బోరుమంది. విద్యుత్ షాక్కు గురై ముగ్గురు మృతి చెందగా మరోవ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాద సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యతండాలో జరిగింది. కొంతమంది యువకులు దుర్గమ్మ పండుగకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో 11 కే.వీ విద్యుత్ వైర్ తెగి వారి మీద పడింది. ఓ బాలుడితో సహా నలుగురు వ్యక్తులు విద్యుత్ షాక్కు గురయ్యారు. భూక్యా దేవేందర్, అనిల్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రవి అనేవ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.
జశ్వంత్ అనే బాలుడు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుర్గమ్మ పండుగ నేపథ్యంలో ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టెంట్ వేస్తున్న క్రమంలో టెంట్ కర్రలు 33/11 కేవి లైన్కు తగిలి తెగి పడటంతో ఈ విషాదం అలముకుంది. మృతులలో దేవేందర్ రాయపర్తి మండలం గట్టికల్లు గ్రామానికి చెందిన వాడు, అనీల్ తొర్రూరు మండలం జమస్తన్ పురంతండాకు చెందిన వాడుగా గుర్తించారు. ఊరంతా ఆర్తనాదాలతో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్కు జరిమానా
నేపాల్లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

