AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఆగి వున్న రైలులో అకస్మాత్తుగా మంటలు..కాలి బూడిదైన బోగి.. ఏం జరిగింది..?

Watch Video: ఆగి వున్న రైలులో అకస్మాత్తుగా మంటలు..కాలి బూడిదైన బోగి.. ఏం జరిగింది..?

G Peddeesh Kumar
| Edited By: Srikar T|

Updated on: Mar 05, 2024 | 12:02 PM

Share

ఖాజీపేట రైల్వే స్టేషన్ యార్డులో అగ్నిప్రమాదం జరిగింది. మరమ్మత్తుల కోసం నిలిపి ఉన్న రైల్ బోగీ నుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో బోగీ కాలి బూడిదయ్యింది. ఈ ప్రమాదం కాజీపేట రైల్వే జంక్షన్‎లో జరిగింది. మరమ్మత్తు కోసం ప్యాసింజర్ రైలును యార్డు పక్కన నిలిపారు. రైలు వెనుక బోగీలో అకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. ఆ పొగలను రైల్వే సిబ్బంది గమనిస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో బోగి బూడిదయ్యింది. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ఖాజీపేట రైల్వే స్టేషన్ యార్డులో అగ్నిప్రమాదం జరిగింది. మరమ్మత్తుల కోసం నిలిపి ఉన్న రైల్ బోగీ నుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో బోగీ కాలి బూడిదయ్యింది. ఈ ప్రమాదం కాజీపేట రైల్వే జంక్షన్‎లో జరిగింది. మరమ్మత్తు కోసం ప్యాసింజర్ రైలును యార్డు పక్కన నిలిపారు. రైలు వెనుక బోగీలో అకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. ఆ పొగలను రైల్వే సిబ్బంది గమనిస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో బోగి బూడిదయ్యింది. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ బోగీలో ఎవరూ లేకపవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి కారణాలపై రైల్వే అధికారులు, పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణమా..? లేక ఎవరైనా ఆకతాయిలు ఆగివున్న రైలుకు నిప్పు పెట్టరా.? లేదా ఎవరైనా ప్రయాణికులు మండే స్వాభావం కలిగిన పరికరాలు రైలు బోగీలో వదిలారా.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..