Telangana: గ్రామ శివారులో కుప్పలు తెప్పలుగా కళేబరాలు.. ఆరా తీయగా
మంచిర్యాల జిల్లాలో ఒకేచోట 50 కుక్కల కళేబరాలు కనిపించాయి. ఊళ్లలో పట్టి ఇక్కడకు తెచ్చి చంపేసారంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాండూరు గ్రామ శివారులో పదుల సంఖ్యలో కళేబరాలు.. మత్తుమందు ఇచ్చి పిచ్చికుక్కల్ని పట్టుకున్నామంటున్న పంచాయితీ సిబ్బంది. తెచ్చి అడవిలో వదిలేసాం.. చంపలేదంటున్నారు.
మంచిర్యాల జిల్లాలో ఒకేచోట 50 కుక్కల కళేబరాలు పడి ఉండడం కలకలం రేపింది. చుట్టుపక్కల ఊళ్లలోంచి కుక్కల్ని పట్టి తెచ్చి ఇక్కడ చంపేశారంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాండూరు గ్రామ శివారులో పదుల సంఖ్యలో ఇలా కళేబరాలు కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఐతే.. తాము కుక్కల్ని చంపలేదని, కేవలం మత్తుమందు ఇచ్చి పిచ్చికుక్కల్ని పట్టుకున్నామని పంచాయితీ సిబ్బంది చెప్తున్నారు. తర్వాత వాటిని తెచ్చి అడవిలో వదిలేసామంటున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు పరిసరాల్లో వందలాది కుక్కలు జనాల్ని బయపెడుతున్నాయి. ఇటీవల కూడా పిల్లలు కుక్కకాట్లతో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చేరిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమకు ఫిర్యాదులు అందడంతో వీటిని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేందుకు ఓ బృందాన్ని రప్పించామని MPDO శ్రీనివాస్ చెప్పారు. తాము మత్తుమందు ఇచ్చి వాటిని పట్టుకున్నామని, ఎక్కడా చంపలేదని, చంపాలని చెప్పలేదని కూడా క్లారిటీ ఇస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో
