Telangana: ట్రైన్లోని జనరల్ భోగిలో ఘాటైన వాసన.. ఓ మూలాన ఉన్న బ్యాగులు చెక్ చేయగా
ఖమ్మం రైల్వే స్టేషన్ ఆవరణలో 50 కేజీలు గంజాయి ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్రైన్ లో గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులు ఖమ్మం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి పూణెకు తరలిస్తూ.. ఖమ్మంలో ట్రైన్ దిగిన నిందితులు వద్ద రెండు బ్యాగులను చెక్ చేయగా గంజాయి బయట పడింది.
ఖమ్మం జిల్లాలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. ఖమ్మం రైల్వేస్టేషన్ ఆవరణలో 25 లక్షల విలువైన 50 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను ఖమ్మం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనిఖీలు జరుగుతున్న క్రమంలో నిందితులు ట్రైన్లో దిగి వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర ఉన్న రెండు బ్యాగులను చెక్ చేయగా.. గంజాయి బయటపడింది. ఒడిశా నుంచి పూణేకు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు నిందితులు ఒడిశాకు చెందిన వారిగా పోలీసులు నిర్ధారించారు. ఎవరైనా గంజాయి తరలివస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
Published on: Nov 25, 2025 08:57 AM
Follow Us
వైరల్ వీడియోలు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

