బాబోయ్..హైదరాబాద్లో 20 అడుగుల భారీ కొండచిలువ కలకలం..
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హసన్ నగర్ లో భారీ కొండచిలువ కలకలం రేపింది. భారీ కొండచిలువను చూసి ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైయ్యారు. కొండచిలువ 20 ఫీట్ల పొడవు ఉండడంతో కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు,అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు స్ధానికులు.
రాజేంద్రనగర్ సర్కిల్ పరిదిలోని హసన్ నగర్ లో ఒ భారీ కొండచిలువ సంచరించింది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కొండ చిలువ జనాల్లోకి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. హసన్ నగర్ లోని అయిస్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చిన కొండచిలువను చూసిన జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారీ కొండచిలువను చూసిన ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైయ్యారు. వెంటనే ఆ కొండచిలువను పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్కు కాల్ చేసి రప్పించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ హకీమ్ మీర్ షెఖిల్ అలి రిస్క్యూ చేసి భారీ కొండచిలువను పట్టుకున్నాడు. కొండచిలువ 20 ఫీట్ల పొడవు ఉండడంతో కంగుతిన్నారు. వన్యప్రాణులు అడవులను వదలి జనవాసాల మధ్యకు చేరుకుంటుండంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే పోలీసులకు,అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు స్ధానికులు. తాను 40 ఏళ్ళుగా పాములను రెస్క్యూ చేస్తున్నానని చెప్పారు. పాము కనిపిస్తే తనకు ఫోన్ చెయ్యాలని ఫోన్ నెంబరు ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?

