లోయలో పడిన పెళ్లి బస్సు !! 10 మంది మృతి !! వీడియో
ఉత్తరాఖండ్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న పెళ్లి బృందం బస్సు లోయలో పడిపోయింది.. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
ఉత్తరాఖండ్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న పెళ్లి బృందం బస్సు లోయలో పడిపోయింది.. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. చంపావత్ జిల్లాలోని సుఖిదాంగ్-దాందమినార్ రహదారి మీదుగా వెళ్తున్న పెళ్లి బృందం వివాహానికి వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొని క్షతగాత్రులను చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. పంచముఖి ధర్మశాలకు చెందిన లక్ష్మణ్ సింగ్ కుమారుడు మనోజ్ సింగ్ పెళ్లి వేడుకకు హాజరై ఫిబ్రవరి 21 అర్ధరాత్రి తర్వాత ఓ వాహనంలో తిరిగి తమ సొంత ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. ఫిబ్రవరి 22 తెల్లవారుజామున 3 గంటన 20 నిమిషాల సమయంలో వాహనం అదుపు తప్పి, రహదారి పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లిందని తెలిపారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.
అర్థరాత్రి రైడ్తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

