లోయలో పడిన పెళ్లి బస్సు !! 10 మంది మృతి !! వీడియో
ఉత్తరాఖండ్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న పెళ్లి బృందం బస్సు లోయలో పడిపోయింది.. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
ఉత్తరాఖండ్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న పెళ్లి బృందం బస్సు లోయలో పడిపోయింది.. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. చంపావత్ జిల్లాలోని సుఖిదాంగ్-దాందమినార్ రహదారి మీదుగా వెళ్తున్న పెళ్లి బృందం వివాహానికి వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొని క్షతగాత్రులను చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. పంచముఖి ధర్మశాలకు చెందిన లక్ష్మణ్ సింగ్ కుమారుడు మనోజ్ సింగ్ పెళ్లి వేడుకకు హాజరై ఫిబ్రవరి 21 అర్ధరాత్రి తర్వాత ఓ వాహనంలో తిరిగి తమ సొంత ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. ఫిబ్రవరి 22 తెల్లవారుజామున 3 గంటన 20 నిమిషాల సమయంలో వాహనం అదుపు తప్పి, రహదారి పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లిందని తెలిపారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

