లోయలో పడిన పెళ్లి బస్సు !! 10 మంది మృతి !! వీడియో
ఉత్తరాఖండ్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న పెళ్లి బృందం బస్సు లోయలో పడిపోయింది.. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
ఉత్తరాఖండ్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న పెళ్లి బృందం బస్సు లోయలో పడిపోయింది.. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. చంపావత్ జిల్లాలోని సుఖిదాంగ్-దాందమినార్ రహదారి మీదుగా వెళ్తున్న పెళ్లి బృందం వివాహానికి వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొని క్షతగాత్రులను చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. పంచముఖి ధర్మశాలకు చెందిన లక్ష్మణ్ సింగ్ కుమారుడు మనోజ్ సింగ్ పెళ్లి వేడుకకు హాజరై ఫిబ్రవరి 21 అర్ధరాత్రి తర్వాత ఓ వాహనంలో తిరిగి తమ సొంత ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. ఫిబ్రవరి 22 తెల్లవారుజామున 3 గంటన 20 నిమిషాల సమయంలో వాహనం అదుపు తప్పి, రహదారి పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లిందని తెలిపారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

