AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఏందిరా సామి.. ఎక్స్‌ప్రెస్‌వే‌ను ఏకంగా డైనింగ్ హాల్‌గా మార్చేశారు కదరా..!

రాజస్థాన్‌లోని ఓ ఎక్స్‌ప్రెస్‌వేపై కుటుంబం భోజనం చేసిన వీడియో వైరల్‌గా మారింది. వాహనాల కోసం నిర్మించిన రహదారిని డైనింగ్ హాల్‌గా మార్చడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది భద్రతా ప్రమాదమని, ప్రజా రహదారులను దుర్వినియోగం చేయకూడదని పలువురు విమర్శిస్తున్నారు. పౌర బాధ్యత, ప్రజా ఆస్తుల పట్ల గౌరవం ఆవశ్యకతను ఈ ఘటన గుర్తుచేస్తుంది.

Viral Video: ఏందిరా సామి.. ఎక్స్‌ప్రెస్‌వే‌ను ఏకంగా డైనింగ్ హాల్‌గా మార్చేశారు కదరా..!
Rajasthan Family Eats On Road
Balaraju Goud
|

Updated on: Aug 31, 2026 | 4:00 PM

Share

రాజస్థాన్‌లో ఇటీవల ప్రారంభమైన ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ కుటుంబం చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. వాహనాల రాకపోకల కోసం నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌వేను ఏకంగా కుటుంబ భోజన కార్యక్రమానికి వేదికగా మార్చడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి పక్కన కుటుంబ సభ్యులు కూర్చొని భోజనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ శివ్‌ మహేశ్వరి షేర్‌ చేసిన వీడియోలో.. ఓ కుటుంబానికి చెందిన పలువురు రోడ్డుకు అడ్డంగా కూర్చొని భోజనం చేస్తున్నట్లు కనిపించింది. రహదారిపై వార్తాపత్రికలు, టార్పాలిన్లు పరిచి వాటిపై ప్లేట్లతో కుటుంబ సభ్యులు కూర్చున్నారు. మరికొందరు బంధువులు వారికి ఆహారం వడ్డిస్తూ కనిపించారు. దీంతో ఎక్స్‌ప్రెస్‌వే పక్కన తాత్కాలిక డైనింగ్‌ హాల్‌లా కనిపించింది.

వీడియో వైరల్‌ కావడంతో అది ఎక్స్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కూడా చేరింది. అక్కడ పలువురు నెటిజన్లు కుటుంబం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా రహదారిని వ్యక్తిగత కార్యక్రమాలకు ఉపయోగించడం వల్ల ప్రమాదాలకు అవకాశం ఉంటుందని, కనీస పౌర బాధ్యతను పాటించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం భోజనం చేయడమే కాకుండా ఆ తర్వాత చెత్తను అక్కడే వదిలివెళ్లే అవకాశంపైనా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రదేశాలను శుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పారిశుధ్య సిబ్బంది ఉన్నారనే కారణంతో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం సరికాదని పేర్కొన్నారు.

కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయడం, వేడుకలు నిర్వహించుకోవడం సాధారణమే అయినప్పటికీ.. అందుకోసం ఎక్స్‌ప్రెస్‌వేను ఎంచుకోవడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రహదారులు వాహనాల సురక్షిత ప్రయాణం కోసం నిర్మించిన ప్రజా మౌలిక వసతులు అని, వాటిని వ్యక్తిగత వినోదం లేదా వేడుకలకు ఉపయోగించడం ప్రమాదకరమని పలువురు అభిప్రాయపడ్డారు.

మొత్తంగా.. కుటుంబ సమావేశాన్ని గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకున్నారో, లేక ఆ ప్రాంతాన్ని పిక్నిక్‌ స్పాట్‌గా భావించారో తెలియదు కానీ.. వారి చర్య మాత్రం సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రజా మౌలిక వసతులు అందరివీ.. వాటిని బాధ్యతగా ఉపయోగించాలనే సందేశాన్ని ఈ వైరల్‌ వీడియో మరోసారి గుర్తుచేస్తోంది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మొత్తంగా.. ఈ వైరల్‌ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం కుటుంబం ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల మధ్య కూర్చొని భోజనం చేసినట్లు కాకుండా, హైవే పక్కన ఉన్న విశ్రాంతి ప్రదేశంలో బస్సును పార్క్‌ చేసి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసినట్లు కనిపిస్తోంది. దీంతో అసలు ఘటన ఏమిటి, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎంతవరకు సరైనది అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us