బంగారు నగలతోనే రోజూ స్నానం చేస్తే ఏమౌతుందో తెలుసా?
Jyothi Gadda
18 September 2026
స్నానానికి వాడే సబ్బులు, షాంపూలు, బాడీ వాష్లలో ఉండే రసాయనాలు బంగారు ఆభరణాల మెరుపును తగ్గించి డల్గా కనిపించేలా చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనం వాడే సబ్బు, షాంపూ అవశేషాలు నగల ఉపరితలంపై ఒక పొరలా పేరుకుపోయి, కాలక్రమేణా బంగారం సహజమైన మెరుపును కప్పేస్తాయి.
ముఖ్యంగా రాళ్లు పొదిగిన నగలు లేదా సూక్ష్మమైన డిజైన్లు ఉన్న నగల సందుల్లో ఈ సబ్బు నురగు, మురికి సులభంగా పేరుకుపోయే అవకాశం ఉంది.
కొంతకాలానికి ఈ పొర బాగా గట్టిపడి, బంగారం మృదువైన ఉపరితలాన్ని మసకబారేలా చేయడం వల్ల నగలు పాతవిగా, కాంతిహీనంగా కనిపిస్తాయి.
ముఖ్యంగా 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు ఇటువంటి సబ్బులు, షాంపూల రసాయనాల ప్రభావానికి గురై చాలా త్వరగా తమ మెరుపును కోల్పోతాయి.
అందువల్ల స్నానం చేసే ముందు బంగారు నగలను తీసి పక్కన పెట్టడం వల్ల వాటి మెరుపు, అందం, సహజ కాంతి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.
రోజూ వాడే నగల మెరుపును కాపాడుకోవడానికి వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి గోరువెచ్చని సబ్బు నీటిలో నానబెట్టి శుభ్రం చేయడం చాలా మంచిది.
మెత్తటి టూత్బ్రష్తో నెమ్మదిగా రుద్ది, మంచి నీటితో కడిగి కాటన్ గుడ్డతో తుడవడం వల్ల మీ బంగారు నగలు ఎప్పుడూ కొత్తవాటిలా మెరుస్తూ ఉంటాయని తెలుస్తోంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
రోజూ ఒక కప్పు ఉడికించిన సోయాబీన్స్ తిన్నారంటే..ఈ సమస్యలన్నీ పరార్!
ఈ దిశలో మందార మొక్కను నాటితే ఐశ్వర్యం మీ వెంటే!
వర్షాకాలంలో రాగులు వాడుతున్నారా..? ఇది తెలుసుకోండి..!