పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం.. 95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే..?

పెళ్లిలో ఏడు అడుగులు వేశారు. జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్న ఒక జంట కలిసే జీవితాన్ని ముగించారు. మూడుముళ్లతో ఒక్కటైన ఈ జంట మరణంలోనూ కలిసి తుది వీడ్కోలు తీసుకున్నారు. ఈ విషాద సంఘటన కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు ఆ ఊరందరినీ తీవ్ర విషాదంలో ముంచేసింది. ఒక వృద్ధ దంపతులు మరణంలోనూ కలిసి ఉండటం చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం.. 95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే..?
Bihar Elderly Couple Dies Together

Updated on: Jan 21, 2026 | 2:39 PM

జంటలు స్వర్గంలో ముడిపడతాయని అంటారు..కానీ, సమస్తిపూర్ జిల్లాలోని ఉజియార్పూర్ బ్లాక్‌ పరోరియా గ్రామానికి చెందిన ఒక వృద్ధ జంట ఈ మాటను వాస్తవమని నిరూపించారు. ఏళ్లతరబడి ఒకరినొకరు కష్ట, సుఖాల్లో కలిసి ఉన్నారు..చివరకు మరణాన్ని కూడా వారు కలిసి ఉండాలని వారు నమ్మకంగా ఉన్నారు. అందుకే భర్త మరణించిన కొద్దిసేపటికే భార్య కూడా తుది శ్వాస విడిచిపెట్టింది. ఈ సంఘటన ఆ ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారింది.

బీహార్ లోని ఉజియార్‌పూర్‌లోని పరోరియా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. 95 ఏళ్ల రైతు యుగేశ్వర్ రాయ్ తన కుటుంబంతో చాలా కాలంగా సంతోషకరమైన జీవితాన్ని గడిపాడు. నిన్న రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. యుగేశ్వర్‌ మృతితో ఇంట్లో విషాదం నెలకొంది. చుట్టాలు, బంధువులు ఆయన అంత్యక్రియలకు సిద్ధమవుతోంది. తీరని దుఃఖంతో అతని భార్య..కన్నీరు మున్నీరుగా విలపించింది. తన భర్త నుండి విడిపోవడాన్ని భరించలేక ఆ 90 ఏళ్ల టెట్రి దేవి తనతోపాటే పయనమైంది.

తన జీవిత భాగస్వామి మృతదేహం పక్కన కూర్చుని ఓదార్చలేని విధంగా ఏడుస్తోంది. తన భర్త మరణంతో షాక్‌కు గురైన ఆమె అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. అలా కొన్ని క్షణాల్లోనే తను కూడా మరణించింది. ఆమె అచంచలమైన ప్రేమ ఫలితంగానే, ఒక్క క్షణం కూడా తన భర్త నుండి విడిపోవడాన్ని ఆమె భరించలేకపోయిందని గ్రామస్తులు అంటున్నారు. ఒకేసారి ఇద్దరు వృద్ధ దంపతుల మరణంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

ఇవి కూడా చదవండి

ఈ జంట కలిసి మరణించారనే వార్త వ్యాపించగానే, గ్రామంలో దుఃఖం అలలు అలుముకున్నాయి. ఈ హృదయ విదారకమైన సంఘటనతో ప్రజలు కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు వివాహిత కుమార్తెలు ఉన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us