ఈ డిజిటల్ ఇమేజ్ కోట్లకు అమ్ముడైంది.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. స్పెషల్ ఏంటంటే.!

ఓ డిజిటల్ ఇమేజ్ కోట్లలో అమ్ముడైందని మీరు ఎప్పుడైనా విన్నారా? వినడానికి చిత్రంగానే ఉన్నా.. తాజాగా ఓ డిజిటల్ ఇమేజ్..

ఈ డిజిటల్ ఇమేజ్ కోట్లకు అమ్ముడైంది.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. స్పెషల్ ఏంటంటే.!
Photo

Updated on: Mar 17, 2021 | 3:45 PM

JPEG file sold for Rs 501 crore: ఓ డిజిటల్ ఇమేజ్ కోట్లలో అమ్ముడైందని మీరు ఎప్పుడైనా విన్నారా? వినడానికి చిత్రంగానే ఉన్నా.. తాజాగా ఓ డిజిటల్ ఇమేజ్ వేలంలో కోట్లు పలికింది. ఎన్నో ఏళ్లు కష్టపడిన ఆ ఆర్టిస్ట్‌ను బిలినియర్‌ను చేసింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక డిజిటల్ ఇమేజ్‌ను వేలం వేయగా.. అది కాస్తా సుమారు రూ. 501 కోట్లకు అమ్ముడైంది. ఆశ్చర్యపోకండి. ఇది నిజమే.

“ఎవ్రీడేస్ – ది ఫస్ట్ 5000 డేస్” ఆనే పేరుతో అమెరికన్ ఆర్టిస్ట్ మైక్ వింకెల్మన్(బీపిల్) రూపొందించిన ఈ డిజిటల్ వర్క్. 5,000 ఇమేజ్‌లను గ్రూప్ చేసినట్లుగా ఉంటుంది. ఈ ఇమేజ్‌లను రోజుకు ఒకటి చొప్పున పదమూడు సంవత్సరాల పాటు మైక్ శ్రమించి తయారు చేసినట్లు ఓ కథనం ప్రచురితమైంది.

డిజిటల్ ఆర్టిస్ట్ బీపుల్ రూపొందించిన ఈ వర్క్‌ను ఎన్‌ఎఫ్‌టి అని పిలుస్తారు, వీటిని డిజిటల్ కళాకృతులని అంటారు. ఈ డిజిటల్ ఆర్ట్ వర్క్స్‌ను బ్లాక్‌చెయిన్‌ను ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేస్తారు. వీటి క్రయ విక్రయాలు క్రిప్టోకరెన్సీ ద్వారా జరుగుతాయి. బీపుల్ అనే డిజిటల్ ఆర్టిస్ట్ ప్రతిరోజూ ఇలాంటి చిత్రాలను సృస్తిస్తుంటాడు. వాస్తవానికి, బీపుల్స్ 2007వ సంవత్సరం నుంచి ప్రతిరోజూ అలాంటి డిజిటల్ ఇమేజ్‌లను సృష్టిస్తూ వస్తున్నాడు. కాగా, పాపులర్ క్రిప్టోకరెన్సీ ఎథెరియం ద్వారా ఈ డిజిటల్ ఫోటోల క్రయ విక్రయాలు జరుగాతాయి.

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

హోమ్‌లోన్ తీసుకుంటున్నారా.! అయితే ఈ విషయాలను తప్పక గుర్తించుకోండి.. లేదంటే.!