AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇంకా మార్పు రాకుంటే ఎలా.. సమయానికి రాని అంబులెన్స్‌.. జేసీబీలోనే బాధితుడు…

మనుషుల్లో మానవత్వం రోజురోజుకు నశించిపోతోంది. సాటి మనిషి ప్రమాదానికి గురై ఆపదలో ఉన్నా సాయం చేసేందుకు ముందుకు రావడంలేదు. ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం 108 సౌకర్యాన్ని కల్పించింది. కానీ అంబులెన్స్‌..

Viral Video: ఇంకా మార్పు రాకుంటే ఎలా.. సమయానికి రాని అంబులెన్స్‌.. జేసీబీలోనే బాధితుడు...
Patient In Jcb
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 14, 2022 | 10:13 AM

మనుషుల్లో మానవత్వం రోజురోజుకు నశించిపోతోంది. సాటి మనిషి ప్రమాదానికి గురై ఆపదలో ఉన్నా సాయం చేసేందుకు ముందుకు రావడంలేదు. ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం 108 సౌకర్యాన్ని కల్పించింది. కానీ అంబులెన్స్‌ సిబ్బంది కూడా సమయానికి స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి మధ్యప్రదేశ్‌లో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లా బారాహీలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో మహేశ్‌ బర్మన్‌ అనే యువకుడి కాలికి గాయమై విరిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బాధితుడ్ని ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. స్థానికంగా అంబులెన్స్‌ అందుబాటులో లేదని, పక్కన ఉన్న ఊరి నుంచి పంపిస్తామని చెప్పారు. గంటలు గడుస్తున్నాయి. ఎంతకీ అంబులెన్స్‌ రాకపోవడంతో స్థానికులు ఆటోలో తీసుకెళ్దామని ఎందరిని అడిగినా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఎవ్వరూ తమ ఆటోలో అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ఒప్పుకోలేదు. దీంతో పుష్పేంద్ర విశ్వకర్మ అనే వ్యక్తి తన జేసీబీలో అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. దీనిని కొందరు వీడియోతీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

వీడియో చూసిన నెటిజల్లు ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో వైద్య సౌకర్యాల లేమికి ఇది నిదర్శమని ఘాటుగా స్పందిస్తున్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ సభలో పాల్గొన్న సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అంబులెన్సుల సంఖ్యను పెంచామని ప్రకటించడం గమనార్హం. అయితే రోగులు, వ్యాధిగ్రస్తులు, బాధితులకు సరైన సమయంలో అంబులెన్సులు అందుబాటులో లేని ఘటనలు రాష్ట్రంలో పెద్దసంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. గత నెలలో ఓ పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భినిని జేసీబీలో తరలించిన ఘటన నీముచ్‌లో జరిగింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అరుదైన అమావాస్య.. ఆ రాశుల వారికి విశిష్ట యోగాలు పక్కా..!
అరుదైన అమావాస్య.. ఆ రాశుల వారికి విశిష్ట యోగాలు పక్కా..!
గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్‌ ఛూమంత్రం.. ఈ 15 అలవాట్లతో హాంఫట్..
గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్‌ ఛూమంత్రం.. ఈ 15 అలవాట్లతో హాంఫట్..
కేకేఆర్ కి శుభవార్త: జట్టు చేరిన జమ్మూ ఎక్స్‌ప్రెస్!
కేకేఆర్ కి శుభవార్త: జట్టు చేరిన జమ్మూ ఎక్స్‌ప్రెస్!
పసిడిపై నమ్మలేని ఆఫర్లు.. ఆ యాప్స్‌లో అందుబాటులో డిజిటల్ గోల్డ్.!
పసిడిపై నమ్మలేని ఆఫర్లు.. ఆ యాప్స్‌లో అందుబాటులో డిజిటల్ గోల్డ్.!
బెంజ్ కారునుంచి లోకల్ ట్రైన్‌‌ వరకు పడిపోయాం..
బెంజ్ కారునుంచి లోకల్ ట్రైన్‌‌ వరకు పడిపోయాం..
కోతులు ఆడించుకునేదనుకునేరు? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
కోతులు ఆడించుకునేదనుకునేరు? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
'తొలి బంతికే సిక్స్.. కట్‌చేస్తే.. ఏడాదికే కెరీర్ క్లోజ్'
'తొలి బంతికే సిక్స్.. కట్‌చేస్తే.. ఏడాదికే కెరీర్ క్లోజ్'
భూకంపం వస్తుందని టిక్‌టాక్‌లో వీడియో.. ఆ తర్వాత ఏం జగిరిందంటే..
భూకంపం వస్తుందని టిక్‌టాక్‌లో వీడియో.. ఆ తర్వాత ఏం జగిరిందంటే..
41 ఫోర్లు, 21 సిక్సర్లతో విరుచుకుపడ్డ అరవీర భయంకరులు..
41 ఫోర్లు, 21 సిక్సర్లతో విరుచుకుపడ్డ అరవీర భయంకరులు..
ఫ్రీ హిట్‌ మిస్‌.. కావ్య మారన్‌ వైరల్ ఎక్స్‌ప్రెషన్‌
ఫ్రీ హిట్‌ మిస్‌.. కావ్య మారన్‌ వైరల్ ఎక్స్‌ప్రెషన్‌