Cash Seized: పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు..వ్యాపారి ఇంటి నుంచి రూ.72 ల‌క్ష‌లు సీజ్

|

May 14, 2024 | 4:07 PM

అక్కడ నుంచి రూ.31.58 లక్షలను స్వాధీనం చేసుకున్నామని, డబ్బు దొరికిన గదికి సీలు వేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్  ప్రియాంక శుక్లా తెలిపారు. సోమవారం బైరాగఢ్ ప్రాంతంలోని అతని పరిచయస్తుడి ఇంట్లో పోలీసులు రూ.40.11 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. స్వాధీనం చేసుకున్న విషయాన్ని పోలీసులు ఆదాయపు పన్ను శాఖకు తెలియజేసినట్లు ఆయన తెలిపారు.

Cash Seized: పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు..వ్యాపారి ఇంటి నుంచి రూ.72 ల‌క్ష‌లు సీజ్
Cash Seized
Follow us on

ఓ వ్యాపారవేత్త ఇంటి నుంచి ఏకంగా రూ.72లక్షలు సీజ్‌ చేశారు పోలీసులు. భోపాల్‌లోని ఓ వ్యాపారి, అతడికి సంబంధించిన మరో వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు ఈ భారీ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌స్తుతం లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉంది. ఈ క్రమంలోనే భోపాల్‌లో వ్యాపారి వద్ద ఆ సొమ్మును రికవరీ చేసుకున్నారు. అయితే, సదరు వ్యాపారి చిరిగిన, పాత నోట్ల మార్పిడి వ్యాపారం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ పని కోసం తనకు ఆర్బీఐ ఆమోదం పొందినట్టుగా పోలీసులకు చెప్పాడు.

హవాలా ముఠా గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు గురువారం రాత్రి అశోక్ గార్డెన్ ప్రాంతంలోని వ్యాపారి ఇంటిపై దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. అక్కడ నుంచి రూ.31.58 లక్షలను స్వాధీనం చేసుకున్నామని, డబ్బు దొరికిన గదికి సీలు వేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్  ప్రియాంక శుక్లా తెలిపారు.

సోమవారం బైరాగఢ్ ప్రాంతంలోని అతని పరిచయస్తుడి ఇంట్లో పోలీసులు రూ.40.11 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. స్వాధీనం చేసుకున్న విషయాన్ని పోలీసులు ఆదాయపు పన్ను శాఖకు తెలియజేసినట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..