Viral: సమాధులను తవ్వి.. మృతదేహాలను వెలికితీస్తోన్న ప్రజలు.. ఎందుకో తెలిస్తే ప్యాక్ అవ్వాల్సిందే!

|

Aug 17, 2022 | 8:57 PM

ఆ ప్రాంతంలో ప్రజలందరూ ప్రతీ ఏడాది సమాధులు తవ్వుతున్నారు. అంతేకాదు.. అందులో ఉన్న మృతదేహాలను వెలికితీసి.. వాటిని ముస్తాబు చేస్తారు. ఎందుకంటారా.?

Viral: సమాధులను తవ్వి.. మృతదేహాలను వెలికితీస్తోన్న ప్రజలు.. ఎందుకో తెలిస్తే ప్యాక్ అవ్వాల్సిందే!
Representative Image 1
Follow us on

ఆ ప్రాంతంలో ప్రజలందరూ ప్రతీ ఏడాది సమాధులు తవ్వుతున్నారు. అంతేకాదు.. అందులో ఉన్న మృతదేహాలను వెలికితీసి.. వాటిని ముస్తాబు చేస్తారు. ఎందుకంటారా.? ఆ కథేంటో తెలుసుకుందాం..

వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియాలోని దక్షిణ సులవేసి ప్రాంతంలో టోర్జా అనే తెగకు చెందినవారు నివసిస్తున్నారు. ఈ తెగకు చెందిన వ్యక్తులు ఓ వింత ఆచారాన్ని ప్రతీ ఏడాది ఆచరణలో పెట్టారు. ఆధ్యాత్మికం అనే మార్గంలో లైఫ్ అండ్ డెత్ అనేవి రెండు భాగాలుగా నమ్ముతున్న వీరు.. చనిపోయిన తమ ప్రియమైన వారి మృతదేహాలను సమాధుల నుంచి వెలికితీసి.. ఆ శవాలను ముస్తాబు చేస్తుంటారు. వాటితో ఫోటోలు దిగుతారు. మరణించిన కుటుంబసభ్యులతో వారికున్న మంచి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఇదొక గొప్ప మార్గమని ఆ తెగ ప్రజల నమ్మకం.

అంతేకాదు, ఈ తెగకు చెందిన ప్రజలు చనిపోయిన వారి కుటుంబ సభ్యులను వారాలు, నెలల తరబడి ఇళ్లల్లో ఉంచుతారు. వాటితో మాట్లాడతారు.. వాటికి ఆహారాన్ని తినిపిస్తారు. అనంతరం ఘనంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ వేడుక మూడు రోజుల పాటు జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు నాగరీకమైన దుస్తుల్లో ఉన్న శవాలను చూసేందుకు తరలి వస్తుంటారు.

ఇవి కూడా చదవండి

ఇండోనేషియాలో ఆధునికీకరణ పెరుగుతున్నప్పటికీ, ఈ సంప్రదాయం సులవేసి ప్రాంతంలో శతాబ్దాలుగా కొనసాగింది. తోరాజన్లు దాదాపు 11 లక్షలు మంది ఉండగా.. వీరిలో 4 లక్షల 50 వేల మంది తానా టోరాజ్ రీజెన్సీలో నివసిస్తున్నారు. కాగా, టోరాజా అనేది బుగినీస్ భాషా నుంచి వచ్చింది. దీనికి “ఎత్తైన ప్రాంతాల ప్రజలని” అర్థం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

ఇది చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..