ఇదేం మాయరా బాబు.. వండకుండానే అన్నంలా మారిపోతున్న బియ్యం

| Edited By: Team Veegam

Aug 07, 2019 | 4:54 PM

ఎక్కడైనా సరే అన్నం తినాలంటే బియ్యం పొయ్యిమీద ఉడకాల్సిందే. మరి బియ్యం ఉడికించకుండానే అన్నంలాగ మరిపోతే. ఇదేదో మాయాబజార్ సినిమా సీన్ అనుకోకండి . ఇది నిజంగా నిజం. పొయ్యిమీద వండి.. వార్చీ శ్రమ పడాల్సిన పనిలేకుండా దానంతట అదే అన్నంలా మారిపోయే బియ్యం కూడా ఉన్నాయంటే నమ్ముతారా? ఎవరు నమ్మినా నమ్మక పోయినా సరే.. అలాంటి బియ్యం కూడా ఉన్నాయి. అవి ఎక్కడో కాదు.. మన దేశంలోనే. మొఘలాయిల కాలంలో ఈ బియ్యాన్ని విరివిగా సాగుచేసేవారు. […]

ఇదేం మాయరా బాబు.. వండకుండానే  అన్నంలా మారిపోతున్న బియ్యం
Follow us on

ఎక్కడైనా సరే అన్నం తినాలంటే బియ్యం పొయ్యిమీద ఉడకాల్సిందే. మరి బియ్యం ఉడికించకుండానే అన్నంలాగ మరిపోతే. ఇదేదో మాయాబజార్ సినిమా సీన్ అనుకోకండి . ఇది నిజంగా నిజం. పొయ్యిమీద వండి.. వార్చీ శ్రమ పడాల్సిన పనిలేకుండా దానంతట అదే అన్నంలా మారిపోయే బియ్యం కూడా ఉన్నాయంటే నమ్ముతారా? ఎవరు నమ్మినా నమ్మక పోయినా సరే.. అలాంటి బియ్యం కూడా ఉన్నాయి. అవి ఎక్కడో కాదు.. మన దేశంలోనే.

మొఘలాయిల కాలంలో ఈ బియ్యాన్ని విరివిగా సాగుచేసేవారు. 17 శతాబ్దంలో యుద్ధసమయాల్లో సైనికులు ఈ బియ్యంతోనే ఆకలి తీర్చుకునేవారట. అయితే కాలక్రమేణా దీని ప్రాధాన్యత తగ్గిపోవడంతో కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే ఈ బియ్యం పరిమితమైపోయాయి. ఇంతకీ ఈ బియ్యాన్ని ఏమంటారు? ఎక్కడ లభ్యమవుతాయి? వీటిని ఎవరు పండిస్తున్నారు? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం.

అసోంలో తరతరాలుగా ఈ బియ్యాన్ని సాగుచేస్తున్నారు. దీన్ని ”బోకో సౌల్” లేదా “మట్టి బియ్యం” అని పిలుస్తుంటారు. అయితే ఈ బియ్యానికి మరో పేరుకూడా ఉంది. అదే “మ్యాజిక్ రైస్”. నిజంగా ఈ బియ్యం మ్యాజిక్ రైసే.. ఎందుకంటే వీటిని అన్నం వండే పాత్రలోకి తీసుకుని ఒక గంట సేపు నానబెట్టి ఉంచితే అచ్చం వండివార్చిన అన్నంలాగే రెడీ అయిపోతుంది. పైసా ఖర్చులేదు, గ్యాస్ అయిపోతుందన్న బెంగ కూడా లేదు.

ఈ బియ్యాన్ని పండించేందుకు జూన్ నెల నుంచి డిసెంబర్ వరకూ ఆరు నెలలు అనుకూలమంటున్నారు అక్కడి రైతులు. వీటిని కొంతమంది శతాబ్దాల తరబడి పండిస్తూనే వస్తున్నారు. దీనికి కేంద్రం ప్రభుత్వం పేటెంట్ కూడా ఇవ్వడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ మ్యాజిక్ రైస్ కోసం చర్చకు దారితీసింది. అయితే స్వదేశీ పరిఙ్ఞానంతో వ్యవసాయ శాస్త్రవేత్తలు మరోసారి ఈ వంగడాన్నిసృష్టించారు.

అసోంలో అనాది కాలంగా వస్తున్న ఈ బియ్యం సాగుపై గువాహటీ విశ్వవిద్యాలయంలో ఎన్నో పరిశోధనలు జరిగాయి. అసలు వండకుండా అన్నం ఎలా రెడీ అవుతుందన్న విషయం ఇప్పటికీ తెలలేదు. అయితే మామూలుగా వండితే ఎలా ఉంటుందో.. అచ్చం ఇది కూడా అలాగే ఉండటంతో పరిశోధక విద్యార్ధులే ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఎలాంటి ఖర్చులేకుండా ఒక్క గంట చల్లటి నీటిలో ఈ బోకో సౌల్ బియ్యాన్ని నానబెడితే చాలు. పువ్వులా విచ్చుకున్న తెల్లటి అన్నం రెడీ అవుతుందంటున్నారు అసోం ప్రజలు. దీనితోనే పలు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రజలు వారి ప్రత్యేక పండుగలు, కార్యక్రమాలన్నీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇలాంటి పంటలు దేశంలో మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరిస్తే చాలా బాగుంటుంది కదూ..!