Viral Video: అయ్యో.! తల్లి సమాధిపై కూర్చుని చిన్నారి మాటలు.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు.!
ఇంటర్నెట్లో ప్రతిరోజూ వేలాది వీడియోలు వెలుగులోకి వస్తుంటాయి. వాటిలో కొన్ని నిజంగా హృదయాన్ని కదిలిస్తాయి. మరికొన్ని మనస్సును దోచేస్తుంటాయి. అలాంటి ఒక చిన్నారి భావోద్వేగ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత, కఠిన హృదయులను సైతం కన్నీరు పెట్టిస్తోంది.

ఇంటర్నెట్లో ప్రతిరోజూ వేలాది వీడియోలు వెలుగులోకి వస్తుంటాయి. వాటిలో కొన్ని నిజంగా హృదయాన్ని కదిలిస్తాయి. మరికొన్ని మనస్సును దోచేస్తుంటాయి. అలాంటి ఒక చిన్నారి భావోద్వేగ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత, కఠిన హృదయులను సైతం కన్నీరు పెట్టిస్తోంది.
ఈక్వెడార్కు చెందినదిగా చెబుతున్న ఈ వీడియోలో, ఒక చిన్నారి తన తల్లి సమాధి దగ్గర కూర్చుని ఉంది. ఈ అమాయకపు అమ్మాయికి తన తల్లిని కోల్పోయిన బాధ తెలియకపోవచ్చు, కానీ ఆమె హృదయం ఇంకా ఆమె కోసమే పరితపిస్తోంది. ఆ చిన్నారి తల్లి సమాధి దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశంలో కూర్చుని, తన తల్లి ఫోటోను తదేకంగా చూస్తూ ఉండిపోయింది. ఆ అమాయక చిన్నారి తన వెంట తెచ్చుకున్న ఆటబొమ్మలను బయటకు తీసి తల్లితో ఆడటం మొదలుపెట్టిందినప్పుడు, ఒక హృదయ విదారక దృశ్యం ఆవిష్కృతమవుతుంది. ఆ తర్వాత, తన తల్లి నిజంగా తన ఎదురుగా కూర్చున్నట్లుగా భావించి, ఆమె ఒడిలో ఉన్న భావన కలిగేలా ఆ ఫోటోతో మాట్లాడుతుంది. ఈ దృశ్యం నిజంగా హృదయాన్ని కదిలిస్తుంది. ఈ దృశ్యం ఎంతటి కఠిన హృదయాలను సైతం కరిగించేసింది.
@streetchapri అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన ఈ వీడియోను 18 లక్షలకు పైగా వీక్షించారు. కేవలం కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్ నెటిజన్లను బాగా భావోద్వేగానికి గురి చేసింది. ఒక యూజర్, “తల్లికి సాటి ఎవరూ లేరు. ఈ అమ్మాయికి దేవుడు ధైర్యం ప్రసాదించాలి” అని వ్యాఖ్యానించారు. మరొకరు, “నాకు ఏడుపు ఆగలేదు” అని అన్నారు.
వీడియోను ఇక్కడ చూడండిః
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
