Helicopter: కేదార్‌నాథ్‌లో అదుపుతప్పిన హెలికాఫ్టర్‌, ల్యాండింగ్‌ సమయంలో ప్రమాదం, వీడియో వైరల్‌

|

Jun 06, 2022 | 7:16 PM

ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న చార్ ధామ్ యాత్రలో భక్తుల రద్దీ నెలకొంది. దైవ దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కేదార్‌నాథ్ ధామ్‌కు తరలివస్తారు. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు సంబంధించిన ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Helicopter: కేదార్‌నాథ్‌లో అదుపుతప్పిన హెలికాఫ్టర్‌, ల్యాండింగ్‌ సమయంలో ప్రమాదం, వీడియో వైరల్‌
Helicopter
Follow us on

ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న చార్ ధామ్ యాత్రలో భక్తుల రద్దీ నెలకొంది. దైవ దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కేదార్‌నాథ్ ధామ్‌కు తరలివస్తారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల తర్వాత భక్తుల కోసం యాత్ర ప్రారంభమైంది. అటువంటి పరిస్థితిలో, పెద్ద సంఖ్యలో ప్రజలు కేదార్‌నాథ్‌కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేదార్‌నాథ్‌లో క్షేత్రంలో తృటిలో పెనుప్రమాదం తప్పింది. హెలిప్యాడ్‌లో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్‌ నియంత్రణ కోల్పోయింది. పైలట్‌ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న వ్యక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

హెలికాప్టర్ ల్యాండింగ్‌కు సంబంధించిన ఈ వీడియో మే 31 నాటిదిగా తెలిసింది. వీడియోలో ఒక ప్రైవేట్ ఎయిర్‌లైన్ హెలికాప్టర్ కేదార్‌నాథ్ హెలిప్యాడ్‌లో ల్యాండ్ అవుతున్నప్పుడు అకస్మాత్తుగా దాని నియంత్రణను కోల్పోయింది. కానీ, పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. విమానం సురక్షితంగా ల్యాండ్ చేయబడింది. పూర్తి అదృష్టవశాత్తూ ఈ సమయంలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదు. హెలికాప్టర్ ల్యాండింగ్ చేస్తున్న వీడియోలో.. ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ మెల్లగా ఎలా వంగి ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. ల్యాండింగ్ చేస్తున్నప్పుడు, పైలట్ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోవడం, హెలికాప్టర్ గాలి నుండి భూమికి కదులుతున్నట్లు కనిపిస్తుంది. అయితే, కొన్ని సెకన్ల తర్వాత, పైలట్ పరిస్థితిని గ్రహించి, సురక్షితంగా ల్యాండ్ చేశాడు.

ఈ వీడియో బయటపడిన తర్వాత, ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) తెలిపింది. అదే సమయంలో ఈ విషయాన్ని ఆ శాఖ సీరియస్‌గా తీసుకుంది. ప్రైవేట్ హెలికాప్టర్ ఆపరేటర్లకు జారీ చేసిన ఉమ్మడి SOP భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని కోరినట్లు DGCA తన ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో, వారి కార్యకలాపాలపై భద్రతను దృష్టిలో ఉంచుకుని స్పాట్ చెక్ కూడా ప్లాన్ చేయాలని నిర్ణయించింది.