AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బయటపడ్డ 1500 సంవత్సరాల నాటి అస్థిపంజరం.. వెలుగులోకి సంచలనాలు..!

తవ్వకాలు జరుపుతున్నప్పుడు చాలా సార్లు, చరిత్ర పుటలలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు వెలుగులోకి వస్తుంటాయి. మనం ఎప్పుడూ ఊహించనివి. ఇటీవల ఇజ్రాయెల్‌లో అలాంటి ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ గొలుసులతో కట్టి పడేసిన ఒక మహిళ అస్థిపంజరం బయటపడింది. దీన్ని చూసిన పరిశోధకులు షాక్ అయ్యారు.

బయటపడ్డ 1500 సంవత్సరాల నాటి అస్థిపంజరం.. వెలుగులోకి సంచలనాలు..!
Human Skeleton Found In Israel[1]
Balaraju Goud
|

Updated on: Mar 08, 2025 | 8:22 PM

Share

చరిత్ర ఎంత వింతగా ఉంటే, అంత ఆసక్తికరంగా ఉంటుంది. దాని పొరలు బయటపడినప్పుడు, అది ప్రజలను వారి అభిప్రాయాన్ని మార్చుకునేలా చేస్తుంది. ఇప్పటివరకు ఇలాంటి కథలు చాలా వెలుగులోకి వచ్చాయి. అవి మన ఆలోచనలను పూర్తిగా మార్చేశాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 3 సంవత్సరాల క్రితం, 1500 సంవత్సరాల నాటి అస్థిపంజరం ఒకటి బయటపడింది. దాన్ని పూర్తిగా గొలుసులతో కట్టి బంధించినట్లు కనిపించింది. దానిని చూసిన తర్వాత, శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు.

ఈ అస్థిపంజరాన్ని చూసిన వెంటనే శాస్త్రవేత్తలు అది ఒక మనిషి అస్థిపంజరం అని భావించారు. అయితే, ఈ విషయం ఇప్పుడు తెరపైకి వచ్చిన విషయాలు ప్రజల ఆలోచనలను పూర్తిగా మార్చేశాయి. అస్థిపంజరాన్ని పరిశీలించిన తర్వాత అది పురుషుడి అస్థిపంజరం కాదని, స్త్రీ అస్థిపంజరం అని, ఆమె శరీరంపై ఉన్న గొలుసులు ఆమెకు శిక్ష కాదని, ఆమె స్వయంగా ఈ గొలుసులను ధరించిందని శాస్త్రవేత్తలు కనుగొన్నప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.

మీడియా కథనాల ప్రకారం, ఇది త్యాగం, తపస్సులో మార్గంగా భావిస్తు్న్నారు. దీనికి సంబంధించి, చరిత్రకారులు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన తర్వాత, రోమన్ సామ్రాజ్యంలో మహిళలు సన్యాసి జీవితం కోసం ఇలాంటిదే చేసేవారని భావిస్తున్నారు. నాల్గవ శతాబ్దంలో, ఈ ప్రక్రియలో ప్రత్యేక పెరుగుదల కనిపించిందని చెబుతారు. చరిత్రకారులు తమ జీవితపు చివరి క్షణాల్లో, ప్రజలు ఆహారం, పానీయాలను వదులుకుని ఉపవాసం ఉండేవారని, అన్ని రకాల శారీరక సుఖాలను వదులుకునేవారని చెబుతారు. ఇలా చేయడం ద్వారా, మరణం తరువాత, దేవుడు తనను తన వద్దకు పిలుచుకుంటాడని వారి భావన. సరళంగా చెప్పాలంటే, ప్రజలు దీనిని మోక్షాన్ని పొందే మార్గంగా భావించారు.

ఈ విషయంపై ది జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైన్స్‌లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, తమను తాము బంధించుకునే ఈ సంప్రదాయాన్ని మొదట పురుషులు స్వీకరించారు. దీని గురించి అనేక పత్రాలలో వ్రాయబడి ఉంది. ఆ తరువాత మహిళలు కూడా ఈ సంప్రదాయాన్ని స్వీకరించడం ప్రారంభించారు. ఈ అస్థిపంజరం గురించి మాట్లాడుకుంటే, పరిశోధకులు ఈ స్త్రీని ఎంతో గౌరవంగా గొలుసులతో పాతిపెట్టారని భావిస్తున్నారు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..