Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంకల్ప బలం అంటే ఇదేనేమో.. డిగ్రీ చదివాడు.. వ్యాపారం చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా సాధించాడు..

డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ఎవరైనా ఉద్యోగం కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. కొంతమంది అయితే ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటారు. వ్యాపారం చేయడం అంత సులభం కాదు. పెట్టుబడి ఉండాలి. వ్యాపారం ఎలా చేయాలో తెలిసుండాలి. కాని ఒక..

సంకల్ప బలం అంటే ఇదేనేమో.. డిగ్రీ చదివాడు.. వ్యాపారం చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా సాధించాడు..
Bcom Gradute Started tiffin Business
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 13, 2022 | 2:23 PM

డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ఎవరైనా ఉద్యోగం కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. కొంతమంది అయితే ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటారు. వ్యాపారం చేయడం అంత సులభం కాదు. పెట్టుబడి ఉండాలి. వ్యాపారం ఎలా చేయాలో తెలిసుండాలి. కాని ఒక లక్ష్యం పెట్టుకుని.. దాని కోసం ప్రయత్నిస్తే సాధించలేనిది అంటూ ఏమి ఉండదు. కాని కొంతమంది భారీ లక్ష్యం పెట్టుకుంటారు. అది మన స్థాయికి, సామర్ధ్యానికి మించినది కావడంతో.. లక్ష్యాన్ని సాధించకుండానే వ్యాపారస్తులుగా మారాలనుకునే అనేకమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కాలం గడిపేస్తారు. కాని కొంతమంది మాత్రం తమ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో ప్లాన్ చేసుకుంటారు. ఆకాశానికి నిచ్చెన వేయకుండా తమ సామర్థ్యాన్ని, స్థాయిని బట్టి లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న వారు తప్పకుండా విజయం సాధిస్తారు. సరిగ్గా ఓ యువకుడికి సంబంధించిన ఇలాంటి ఓ స్ఫూర్తిదాయక సంఘటన నెట్టింట్లో వైరల్ అవుతోంది. తాను ఆహార రంగానికి సంబంధించిన వ్యాపారం చేయాలనుకున్నాడు. అది చిన్నదా పెద్దదా అని ఆలోచించలేదు. తనకు అందుబాటులో ఉన్న వనరులతో ఓ చిరు వ్యాపారాన్ని ప్రారంభించాడు. తన ఆలోచనను ఏ విధంగా ఆచరణలో పెట్టాడో వివరిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ ఫుడ్ బ్లాగర్ సంస్థ.

బికామ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఓ యువకుడు తన జీవనోపాధి కోసం సౌత్ ఇండియన్ ఫుడ్ స్టాల్‌ను ఏర్పాటు చేశాడు. హర్యానాలోని ఫరీదాబాద్ కు చెందిన అవినాష్ 2019లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత మెక్‌డొనాల్డ్ సంస్థలో మూడేళ్లపాటు పనిచేశాడు. అయితే సొంతంగా వ్యాపారం చేయాలనేది అతని లక్ష్యం. నిధుల కొరత కారణంగా ఆ లక్ష్యాన్ని మొదట్లో సాకారం చేసుకోలేకపోయాడు. దీంతో ఉద్యోగంలో చేరారు. ఆతర్వాత బైక్ పై కూడా ఫుడ్ బిజినెస్ చేయవచ్చని తెలుసుకుని.. తక్కువ పెట్టుబడితో చేయగల వ్యాపారం కోసం ఆలోచించాడు. అదే సమయంలో తాను చేయగలనో లేదో, తన దగ్గర ఉన్న వనరులను చూసుకున్నాడు. ఇక ఆలస్యం చేయలేదు. సమయాన్ని వృథా చేయకుండా ఉద్యోగానికి స్వస్తి చెప్పి బైక్ పై ఇడ్లీ-సాంభార్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. దేశంలో చాలా మంది సౌత్ ఇండియా ఫుడ్ ను ఇష్టపడుతుంటారు. అందులోనూ ఇడ్డీ-సాంబార్ అంటే లొట్టలేసుకుని లాంగిచేస్తారు. ఫరీదాబాద్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోది కావడంతో చాలా మంది దక్షిణ భారత దేశానికి సంబంధించిన వారు ఉద్యోగం, ఉపాధి కోసం అక్కడ నివాసముంటూ ఉంటారు. నార్త్ ఇండియాలో సౌత్ ఇండియా ఫుడ్ ప్రత్యేకంగా అల్ఫాహరానికి సంబంధించిన వెరైటీలు తక్కువుగా దొరుకుతుంటాయి. దీంతో ఇడ్టీ- సాంబార్ దుకాణాన్ని బైక్ పై ప్రారంభించాడు. అవినాష్ భార్య సౌత్ ఇండియన్ కావడంతో ఆహారం తయారీలో తనకు భార్య సహకరిస్తుందని చెప్పుకొచ్చాడు. తాను డిగ్రీ పూర్తిచేసిన తరువాత తనకు తండ్రి బహుమతిగా ఇచ్చిన బైక్ ఉందని, దానికి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందన్నాడు. తన తండ్రి ఇచ్చిన ద్విచక్రవాహనాన్ని తన వ్యాపారం కోసం ఉపయోగించడం ఓ విధంగా ఆనందంగా ఉందంటున్నాడు అవినాష్. ఫరీదాబాద్ జాతీయ రహదారిపై ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇడ్లీ-సాంబార్ విక్రయిస్తాడు ఈ యువకుడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినప్పటికి నుంచి లక్షలాది మంది వీక్షించడంతో పాటు వేలాది మంది లైక్ చేశారు ఈ వీడియోను. చాలా మంది వ్యాపారం చేయాలనుకుంటారు. అయితే టిఫిన్ అమ్మడం వంటి చిన్న చిన్నవి చేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని మోహమాట పడతారు. అలాంటి వారికి అవినాష్ స్టోరీ స్ఫూర్తిదాయకమనే చెప్పుకోవాలి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..