సంతలో.. లక్షల్లో అమ్మాయిల బేరం..!! నారాయణ ఖేడ్‌లో ఏం జరుగుతుంది..?

| Edited By:

Oct 31, 2019 | 6:05 PM

18 ఏళ్లు దాటిన ప్రతీ అమ్మాయి అదృశ్యం. రాత్రికి రాత్రే కుటుంబం మొత్తం మాయం. ఎవ్వరూ ఊహించని అనాగరికం. అవును.. గిరిజన తండాల్లో జరుగుతన్న అమానుష దందా.. తాజాగా.. వెలుగులోకి వచ్చింది. సంతలో పశువులను అమ్మినట్టుగా.. అక్కడ అమ్మాయిలను అమ్మేస్తున్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా.. కాసులకు కక్కుర్తి పడి.. మానవ విలువలను మట్టి కలుపుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జల్లా.. నారాయణ ఖేడ్‌లో.. అమాయక గిరిజన యువతుల్ని అమ్మకానికి పెడుతున్నారు. నాలుగేళ్లుగా ఈ అమానుష దందా యథేచ్ఛగా […]

సంతలో.. లక్షల్లో అమ్మాయిల బేరం..!! నారాయణ ఖేడ్‌లో ఏం జరుగుతుంది..?
Follow us on

18 ఏళ్లు దాటిన ప్రతీ అమ్మాయి అదృశ్యం. రాత్రికి రాత్రే కుటుంబం మొత్తం మాయం. ఎవ్వరూ ఊహించని అనాగరికం. అవును.. గిరిజన తండాల్లో జరుగుతన్న అమానుష దందా.. తాజాగా.. వెలుగులోకి వచ్చింది. సంతలో పశువులను అమ్మినట్టుగా.. అక్కడ అమ్మాయిలను అమ్మేస్తున్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా.. కాసులకు కక్కుర్తి పడి.. మానవ విలువలను మట్టి కలుపుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జల్లా.. నారాయణ ఖేడ్‌లో.. అమాయక గిరిజన యువతుల్ని అమ్మకానికి పెడుతున్నారు. నాలుగేళ్లుగా ఈ అమానుష దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. అమాయక అమ్మాయిల్ని.. పెళ్లి పేరుతో మోసం చేసి.. వారి జీవితాల్ని నాశనం చేస్తున్నారు. డబ్బుల కోసం అమ్మాయిల్ని రాజస్థాన్‌కు చెందిన దళారులకు అమ్మేస్తున్నారు. అయితే.. ఈ దందా వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందంటున్నారు స్థానికులు.

డబ్బులకు ఆశపడి.. గిరిజన కుటుంబాలు కూడా.. వాళ్ల అమ్మాయిల్ని అమ్ముతున్నారు. ఒక్కో అమ్మాయిని.. దాదాపు రూ.15 లక్షలకు అమ్మేస్తున్నారు. వ్యాపారం పేరుతో.. రాజస్థాన్ నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు.. నారాయణ ఖేడ్‌లో నివాసం ఏర్పరుచుకుంటున్నారు. మెల్లగా స్థానింగా ఉన్న వారితో పరిచయాలు పెంచుకుని.. ఈ అమ్మాయిల వ్యాపారం కూడా.. గుట్టు చప్పుడు కాకుండా.. నడుపుతున్నారు.