Hyderabad: వెటర్నరీ డాక్టర్ దారుణ హత్య.. కాళ్లు, చేతులు కట్టేసి చాకుతో గొంతు కోసి..

సమాజంలో రోజురోజుకీ హత్యాకాండలు పెరిగిపోతున్నాయి. మనిషిని మనిషి చంపుకోవటమే దారుణం.. అలాంటిది అయినవాళ్లు తమ ఆత్మీయులను, కుటుంబసభ్యులను దారుణంగా కడతేర్చుతున్నారు. మనిషి మృగంలా మారిపోయి ఇష్టారీతిన నేరాలకు పాల్పడుతున్నాడు. తాజాగా హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. భర్తను కొడుకుతో కలిసి రెండో భార్య అత్యంత పాశవికంగా హతమార్చింది.

Hyderabad: వెటర్నరీ డాక్టర్ దారుణ హత్య.. కాళ్లు, చేతులు కట్టేసి చాకుతో గొంతు కోసి..
Hyderabad Murder

Edited By:

Updated on: Mar 05, 2025 | 8:21 AM

సమాజంలో రోజురోజుకీ హత్యాకాండలు పెరిగిపోతున్నాయి. మనిషిని మనిషి చంపుకోవటమే దారుణం.. అలాంటిది అయినవాళ్లు తమ ఆత్మీయులను, కుటుంబసభ్యులను దారుణంగా కడతేర్చుతున్నారు. మనిషి మృగంలా మారిపోయి ఇష్టారీతిన నేరాలకు పాల్పడుతున్నాడు. తాజాగా హైదరాబాద్ మహానగరంలో జరిగిన ఓ దారుణ ఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. అత్యంత దారుణంగా ఓ వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసి స్వయానా కట్టుకున్న భార్య, కన్న కొడుకే ఈ హత్య చేయడం గమనార్హం.

బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిరిధిలోని క్రిస్టల్ టౌన్‌లో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. వెటర్నరీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మసీఉద్దీన్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా రెండో భార్య షబానా, అతని కొడుకు సమీర్ హతమార్చారు. కాళ్లు, చేతులు కట్టేసి చాకుతో గొంతు కోసి ఈ దారుణ ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా హతుడు మసీఉద్దీన్ అచేతన స్థితిలో పడి ఉన్నాడు. అయితే కుటుంబంలో కలహాలే హత్యకు దారి తీశాయనే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..