Telangana: అయ్యో దేవుడా.. పోలియో చుక్కలు వేసిన కాసేపటి తర్వాత..
సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. పోలియో చుక్కలు వేయించుకున్న కాసేపటి తర్వాతే.. ఒక మూడు నెలల చిన్నారి అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. అయితే పోలియో చుక్కలు వికటించడం ద్వారా తమ బాబు చినిపోయాడు బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

దేశవ్యాప్తంగా పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ జరుగుతున్న సమయంలో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నోటి ద్వారా వేసుకునే పోలియో వ్యాక్సిన్ చుక్కలను తీసుకున్న కొద్దిసేపటికే మూడు నెలల బాలుడు మరణించాడు. పోలియో చుక్కలు వేయించిన కాసేపటికే బాలుడు అస్వస్థతకు గురయ్యాడని.. దీంతో చిన్నారిని వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించినట్టు బాధిత తల్లిదండ్రులు చెబుతున్నారు. అక్కడ బాబును పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్టు నిర్ధారించారని చెప్పుకొచ్చారు.
బాధిత తల్లిదండ్రులు ఏం చెబుతున్నారో చూడండి..
అయితే అధికారుల వర్షన్ మాత్రం మరోలా ఉంది. ఆదివారం ఉదయం నుంచి సుమారు 100 మందికిపైగా చిన్నారులకు అదే వ్యాక్సిన్ ఇచ్చామని.. ఏ ఒక్కరికి ఇలా జరగలేదని.. కేవలం ఈ ఒక్క బాబుకు మాత్రమే ఇలా జరిగిందని.. బాబు మరణానికి పోలియే వ్యాక్సిన్ కు ఎలాంటి సంబంధం ఉండక పోవచ్చని చెబుతున్నారు.
అధికారులు వర్షన్ వినండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




