Revanth Reddy: నేటి నుంచే రేవంత్ రెడ్డి ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ పాదయాత్ర.. అడవి దేవతల ఆశీస్సులతో..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఇవాళ ములుగులోని సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పాదయాత్ర ప్రారంభించనున్నారు.

Revanth Reddy: నేటి నుంచే రేవంత్ రెడ్డి ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ పాదయాత్ర.. అడవి దేవతల ఆశీస్సులతో..

Updated on: Feb 06, 2023 | 6:17 AM

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఇవాళ ములుగులోని సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పాదయాత్ర ప్రారంభించనున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా పాదయాత్రకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ సిద్ధమవుతోంది. హాత్ సే హాత్ జోడో అభియాన్‌లో భాగంగా సోమవారం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నుంచి రేవంత్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుంది.

షెడ్యూల్ ఇదీ..

సోమవారం ఉదయం 8 గంటలకు రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి బయలుదేరి.. వరంగల్‌ హైవే మీదుగా ములుగు చేరుకుంటారు. గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మల దగ్గర ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. మేడారం నుంచి కొత్తూరు, నార్లాపూర్‌, ప్రాజెక్ట్‌ నగర్‌ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌ నగర్‌లో భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 4.30 గంటల నుంచి 5 గంటలకు పస్రా గ్రామంలో టీ విరామం తర్వాత పస్రా కూడలిలో సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకొని రాత్రికి రేవంత్‌రెడ్డి అక్కడే బస చేస్తారు.

తొలి విడతలో రేవంత్ రెడ్డి 60 రోజుల పాటు 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించేలా రూట్ మ్యూప్‌ను సిద్దం చేసుకున్నారు. అటు రాష్ట్రానికి చెందిన సీనియర్లు కూడా పాదయాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారు. జోడోయాత్రకు కొనసాగింపుగా ఆయా నియోజకవర్గాలు, జిల్లాల్లో హత్ సే హత్ జోడో పేరుతో పాదయాత్రలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..