Telangana Panchayat Elections 2025 Live: కొనసాగుతున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలు పోలింగ్! పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన ఓటర్లు

Telangana Panchayat Polls 2025 Live Updates :తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయాన్ని పోలింగ్ కేంద్రాలకు భారీగా చేరుకుంటున్నారు ఓటర్లు.. పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి త్వరగా స్వగ్రామాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ నిర్వహించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు అధికారులు.

Telangana Panchayat Elections 2025 Live: కొనసాగుతున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలు పోలింగ్! పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన ఓటర్లు
Panchayat Elections

Updated on: Dec 17, 2025 | 10:31 AM

LIVE NEWS & UPDATES

  • 17 Dec 2025 10:30 AM (IST)

    వరంగల్ జిల్లాలో వినూత్న పోలింగ్ కేంద్రం ఏర్పాటు

    వరంగల్ జిల్లాలో వినూత్న పోలింగ్ కేంద్రం ఏర్పాటు

    నర్సంపేట మండలం లక్నపల్లిలో హరిత పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసిన అధికారులు

    కొబ్బరి మట్టలు, అరిటాకులతో పందిరి వేసిన అధికారులు

    ఓటర్లను ఆకర్షించేదుకు అధికారులు సరికొత్త ప్రయత్నం

    ఆహ్లాదకరమైన, వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు

  • 17 Dec 2025 10:20 AM (IST)

    మహబూబ్‌నగర్ జిల్లాలో 504 గ్రామాల్లో కొనసాగుతున్న పోలింగ్

    మహబూబ్‌నగర్ జిల్లాలో మూడో విడత ఎన్నికలు

    మూడో విడతలో మొత్తం గ్రామపంచాయతీలకు 563

    ఇప్పటికే 52 గ్రామాల్లో ఏకగ్రీవం

    7 గ్రామాల్లో నిలిచి పోయిన ఎన్నికలు

    మిగతా 504 గ్రామ పంచాయతీలకు కొనసాగుతున్న పోలింగ్

    ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు ఓటర్లు.


  • 17 Dec 2025 10:19 AM (IST)

    తెలంగాణలో ఉదయం 9గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు

    తెలంగాణలో ఉదయం 9గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు

    రంగారెడ్డి జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 21.58 శాతం పోలింగ్ నమోదు

    మంచిర్యా జిల్లాలో 9 గంటల వరకు 34 శాతం పోలింగ్

    పెద్దపల్లి జిల్లా ఉదయం 9 గంటల వరకు 22.50 శాతం పోలింగ్

    జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 9 గంటల వరకు 26.11 శాతం పోలింగ్

    కరీంనగర్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 20.66% పోలింగ్ నమోదు

    ఆదిలాబాద్ జిల్లాలో తోమ్మిది గంటల వరకు19.37% నమోదు

    నిర్మల్ జిల్లాలో 9 గంటల వరకు 29.98% నమోదు

    మెదక్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 24.89 శాతం పోలింగ్

    సంగారెడ్డి జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 26.75శాతం పోలింగ్

    రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 18.60 శాతం పోలింగ్

    సిద్దిపేట జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 24.35 శాతం పోలింగ్

    ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 29 శాతం పోలింగ్

  • 17 Dec 2025 10:14 AM (IST)

    జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని నమోదైన పోలింగ్ శాతం

    ధర్మపురిలో ఉదయం 9గంటల వరకు నమోదైన పోలింగ్ 20.33%

    వెల్గటూరులో ఉదయం 9గంటల వరకు 26% పోలింగ్ నమోదు

    ఎండపల్లిలో ఉదయం 9 గంటల వరకు 22.1% పోలింగ్ నమోదు

    గొల్లపల్లిలో ఉదయం 9 గంటల వరకు 26.44% పోలింగ్ నమోదు

    బుగ్గారంలో ఉదయం 9 గంటల వరకు 20.26% పోలింగ్ నమోదు

    పెగడపల్లిలో ఉదయం 9 గంటల వరకు19.19% పోలింగ్ నమోదు

     

  • 17 Dec 2025 10:12 AM (IST)

    వరంగల్ ఉమ్మడి జిల్లాలో 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం

    వరంగల్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 22.26 శాతం పోలింగ్ నమోదు

    జనగామ జిల్లాలో 9 గంటల వరకు 22.51% పోలింగ్ నమోదు

    హనుమకొండ జిల్లాలో 9 గంటల వరకు 21.22 % పోలింగ్ నమోదు

    ములుగు జిల్లాలో 9 గంటల వరకు 20.96 % పోలింగ్ నమోదు

    మహబూబాబాద్ జిల్లాలో 9 గంటల వరకు 24.32% పోలింగ్ నమోదు

    భూపాలపల్లి జిల్లాలో 9 గంటల వరకు 22.01 % పోలింగ్ నమోదు

     


  • 17 Dec 2025 10:10 AM (IST)

    మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

    మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

    చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాల్లోని కిక్కిరిసిన పోలింగ్ కేంద్రాలు

    ఓటు వేసేందుకు ఉత్సాహంగా తరలివస్తున్న యువకులు, వృద్దులు

  • 17 Dec 2025 09:58 AM (IST)

    ఆదిలాబాద్‌ జిల్లాలో ఆరు గ్రామాల్లో ఏకగ్రీవం

    ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో కొనసాగుతున్న పోలింగ్

    7 గంటల నుండే పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన ఓటర్లు

    అదిలాబాద్ జిల్లాలో ఆరు గ్రామాల్లో ఏకగ్రీవం

    బోథ్, సోనాల, బజార్హత్నూర్, నేరేడిగోండ, గుడిహత్నూర్, తలమడుగు గ్రామాల్లో ఏకగ్రీవం

    మిగిలిన 120 గ్రామ పంచాయతీలల్లో కొనసాగుతున్న పోలింగ్

  • 17 Dec 2025 09:55 AM (IST)

    లండన్‌ టూ హైదరాబాద్‌.. పల్లెపోరుకు తరలివచ్చని విద్యార్థి

    పల్లెపోరు కోసం విదేశాల నుంచి వచ్చిన యువకుడు

    ఓటు వేసేందుకు లండన్ నుంచి వచ్చిన విద్యార్థి

    అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న విద్యార్థి లవన్ కుమార్

  • 17 Dec 2025 09:26 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న 90 ఏళ్ల వృద్ధురాలు

    కొనసాగుతున్న మూడో విడత ఎన్నికల పోలింగ్

    రంగారెడ్డి గట్టుపల్లిలో పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్ల క్యూ

    ఓటు హక్కు వినియోగించుకున్న 90 ఏళ్ల వృద్ధురాలు

  • 17 Dec 2025 08:20 AM (IST)

    కరీంనగర్ జిల్లాలో 22 గ్రామాలు ఏకగ్రీవం

    ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

    ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 408 స్థానాలకు 22 ఏకగ్రీవం అయ్యాయి

    దీంతో 386 స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ

  • 17 Dec 2025 08:13 AM (IST)

    ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

    కొనసాగుతున్న మూడోవిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

    ఎలాంటి ఘటనలు జరగకుండా గ్రామాల్లో పోలీసుల బందోబస్తు

    3,752 గ్రామాలు, 28,406 వార్డుల్లో పోలింగ్‌

    సర్పంచ్‌ పదవులకు 12,640 మంది అభ్యర్థుల పోటీ

  • 17 Dec 2025 08:04 AM (IST)

    మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏడు గ్రామాల్లో ఎన్నికలకు బ్రేక్

    మహబూబ్‌నగర్‌ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరగని గ్రామాలు

    ఏడు గ్రామాల్లో జరగని పంచాయతీ ఎన్నికలు

    అమ్రాబాద్‌ మండలంలోని నల్లమల్ల షెడ్యూల్‌ ప్రాంతంలో ఓటర్లు లేకున్నా ఎస్టీ రిజర్వేషన్‌

    నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఏడు గ్రామాలు

  • 17 Dec 2025 07:15 AM (IST)

    మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనున్న పోలింగ్

    తెలంగాణలో ప్రారంభమైన మూడో విడత పంచాయతీ ఎన్నికలు

    మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతోంది

    మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ నిర్వహించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు అధికారులు

    మొత్తం 182 మండలాల్లో పోలింగ్ జరగబోతుంది

    3,752 గ్రామాలు, 28,406 వార్డుల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు

    4,157 గ్రామాలు, 36,434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 394 సర్పంచ్ స్థానాలు, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

    11 గ్రామాలు, 112 వార్డులకు నామినేషన్‌లు దాఖలు కాలేదు

    3752 సర్పంచ్ స్థానాలకు 12,640 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు

    ఇప్పటికే రెండు దఫాల్లో ఎన్నికలు నిర్వహించగా ఇవాళ మూడో విడత పోలింగ్ జరుగుతుంది

    ఇవాళ్టితో గ్రామపంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి.

    పోలింగ్ జరిగే ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు

తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయాన్ని పోలింగ్ కేంద్రాలకు భారీగా చేరుకుంటున్నారు ఓటర్లు.. పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి త్వరగా స్వగ్రామాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ నిర్వహించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు అధికారులు. ఇక ఇవాళ మూడో విడత పోలింగ్ జరుగుతుండగా.. నేటి గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి.

అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 182 మండలాల్లోని 3,752 గ్రామాలు, 28,406 వార్డుల్లో పోలింగ్‌ జరుగుతుతోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 4,157 గ్రామాలు, 36,434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 394 సర్పంచ్ స్థానాలు, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 11 గ్రామాలు, 112 వార్డులకు నామినేషన్‌లు దాఖలు కాలేదు దీంతో 3,752 సర్పంచ్ స్థానాలకు 12,640 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

ఇక ఇప్పటికే రెండు దఫాల్లో ఎన్నికలు నిర్వహించగా ఇవాళ మూడో విడత పోలింగ్ జరుగుతుంది. ఇక ఇవాళ్టితో గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ జరిగే ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.