
తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు విసృతతంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఈ సారి టార్గెట్ మనీ పేరుతో లెక్కకు మించి చేతికి దొరికిన ప్రతిదానిని సీజ్ చేస్తున్నారు పోలీసులు. నగదు, బంగారం, మద్యం, ఉచిత వస్తువులు, తదితర సామాగ్రిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ.. సీజ్ చేసి వాటిని ఎన్నికల సంఘానికి రోజువారీగా లెక్కలు పంపుతున్నారు. ఎప్పుడూ లేవి విధంగా సీజింగ్ టార్గెట్ పెట్టుకోని మరి తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇవ్వాల్టి వరకు అధికారులు స్వాదినం చేసుకున్న మొత్తం సొమ్ము 2కోట్లు దాటింది.
పట్టుబడిన మొత్తంలో రూ. 89 లక్షల ముప్పైవేల నగదు, 84 లక్షల 89వేల విలువై మద్యం ఉన్నాయి. అలాగే రూ. 14 లక్షల 69 వేల విలువగల గల గోల్డ్ ,సిల్వర్ లాంటి విలువైన మెటల్ వస్తువులు ఉన్నట్లు ఈసీ లెక్కలో పేర్కొన్నారు. ఇవి కాకుండా ఉచితాల కి సంబంధించిన బియ్యం, చీరెలు, ల్యాప్ టాప్స్, క్రీడా సామాగ్రి, వాహనాలు ఉన్నట్లు తెలిపారు. గడిచిన వారం రోజుల్లో అన్ని రకాలు కలిపి రూ. 2కోట్ల కు పైగా విలువ గల సోత్తును స్వాదినం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.