జగిత్యాల జిల్లాలో ఘోర ఘటన.. చెవి కమ్మల కోసం బావమరిదిని హత్య చేసిన బావ

|

Jun 28, 2023 | 10:14 AM

భార్యకు అనారోగ్యంగా ఉండటంతో చెల్లెలి కమ్మలు తాకట్టు పెట్టి..  ఆ డబ్బుతో భార్యకు వైద్యం చేయించాడో వ్యక్తి. ఆ విషయం తెలుసుకున్న చెల్లెలి భర్త బావమరిదిని ఘోరంగా చావబాది హతమార్చాడు. ఈ విషాద ఘటన..

జగిత్యాల జిల్లాలో ఘోర ఘటన.. చెవి కమ్మల కోసం బావమరిదిని హత్య చేసిన బావ
Ear Rings
Follow us on

జగిత్యాల: భార్యకు అనారోగ్యంగా ఉండటంతో చెల్లెలి కమ్మలు తాకట్టు పెట్టి..  ఆ డబ్బుతో భార్యకు వైద్యం చేయించాడో వ్యక్తి. ఆ విషయం తెలుసుకున్న చెల్లెలి భర్త బావమరిదిని ఘోరంగా చావబాది హతమార్చాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. జగిత్యాల టౌన్‌ ఎస్సై అబ్దుల్‌ రహీం తెలిపిన వివరాల ప్రకారం..

జగిత్యాల జిల్లా మిషన్‌ కంపౌండ్‌ ప్రాంతానికి చెందిన శివరాత్రి రమేశ్‌ (28) భార్య శైలజ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో భార్యకు వైద్యం చేయించేందుకు చెల్లెలి అనుమతితో ఆమె కమ్మలు తాకట్లు పెట్టి వచ్చిన డబ్బుతో భార్యకు చికిత్స చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న రమేశ్‌ బావ నాగదరి యాకుబ్‌ తన భార్య చెవికమ్మలు వెంటనే తిరిగివ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై సోమవారం రాత్రి (జూన్‌ 26) యాకుబ్‌కు, అతని బావమరిది రమేష్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

కోపోధ్రిక్తుడైన యాకుబ్ రమేశ్‌పై విచక్షణా రహితంగా దాడి చేసి చావబాదాడు. దీంతో రమేష్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే బాధితుడిని జగిత్యాల జిల్లా దవాఖానకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. రమేశ్‌ భార్య శైలజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అబ్దుల్‌ రహీం తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.