
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ( మార్చి 12) ప్రారంభం కానున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలే అస్త్రాలుగా అధికారపక్షం బరిలోకి దిగుతుండగా.. ప్రజాసమస్యలపై గొంత్తెత్తాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది.. ఇక బీజేపీ సూపర్ సిక్స్పై అస్త్రాలను రెడీ చేసుకుంటోంది.. ఇలా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగనున్నాయి.. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేయనున్నారు. వెంటనే సభ వాయిదా పడనుంది. అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఈనెల 15 నుంచి 18వరకు కులగణనపై చర్చ, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చలు జరనున్నాయి.. కాగా.. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హాజరుకానున్నారు.. ఇప్పటికే.. బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించారు.. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రులు ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. సభలో అనుసరించే వ్యూహాలను రచించనున్నారు.
కృష్ణా జలాల హక్కు, రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ, రైతుభరోసా, స్థానిక సంస్థల నిధుల లేమి వంటి అంశాలే ప్రధాన ఎజెండాగా అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి..
దేశంలో తొలిసారి కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ చేపట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని ప్రస్తుత రేవంత్ సర్కార్ సభలో గట్టిగా వాదించనుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తర్వాత కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పార్లమెంట్లో ఆమోదం పొందేందుకు యత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సభను మధ్యలో వాయిదా వేసి ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే అంశంపై నిర్ణయం తీసుకోనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..