KPHB: శివరాత్రి వేళ ఇంట్లో దీపం పెట్టి గుడికి వెళ్లారు.. కాసేపటికి..
హైదరాబాద్ KPHBలో మహాశివరాత్రి సందర్భంగా ఇంట్లో వెలిగించిన దీపాల కారణంగా అర్థరాత్రి అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం జరిగింది.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కాగా దీపాలు, అగరబత్తీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అగ్నిమాపక శాఖ సూచిస్తోంది. పూర్తి వివరాలు ఇలా .. ..
హైదరాబాద్ KPHBలో అర్థరాత్రి అగ్నిప్రమాదం కలకలం రేపింది. KPHB రోడ్నెంబర్-3లోని ఓ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. మహాశివరాత్రి సందర్భంగా ఇంట్లో దీపాలు వెలిగించి కుటుంబసభ్యులు ఆలయానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు ఇంట్లో మంటలు అంటుకున్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ఇంట్లోని సామాగ్రికి భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇంట్లో వెలిగించిన దీపాల కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మహాశివరాత్రి, పండుగల సమయంలో ఇంట్లో దీపాలు వెలిగించినప్పుడు దీపం దగ్గర కాగితాలు, కర్టెన్లు, ప్లాస్టిక్ వస్తువులు పెట్టకూడదు. అలాగే అగరబత్తీలు కూడా జాగ్రత్తగా వాడాలని అగ్నిమాపక శాఖ సూచిస్తోంది.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

