KPHB: శివరాత్రి వేళ ఇంట్లో దీపం పెట్టి గుడికి వెళ్లారు.. కాసేపటికి..
హైదరాబాద్ KPHBలో మహాశివరాత్రి సందర్భంగా ఇంట్లో వెలిగించిన దీపాల కారణంగా అర్థరాత్రి అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం జరిగింది.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కాగా దీపాలు, అగరబత్తీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అగ్నిమాపక శాఖ సూచిస్తోంది. పూర్తి వివరాలు ఇలా .. ..
హైదరాబాద్ KPHBలో అర్థరాత్రి అగ్నిప్రమాదం కలకలం రేపింది. KPHB రోడ్నెంబర్-3లోని ఓ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. మహాశివరాత్రి సందర్భంగా ఇంట్లో దీపాలు వెలిగించి కుటుంబసభ్యులు ఆలయానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు ఇంట్లో మంటలు అంటుకున్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ఇంట్లోని సామాగ్రికి భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇంట్లో వెలిగించిన దీపాల కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మహాశివరాత్రి, పండుగల సమయంలో ఇంట్లో దీపాలు వెలిగించినప్పుడు దీపం దగ్గర కాగితాలు, కర్టెన్లు, ప్లాస్టిక్ వస్తువులు పెట్టకూడదు. అలాగే అగరబత్తీలు కూడా జాగ్రత్తగా వాడాలని అగ్నిమాపక శాఖ సూచిస్తోంది.
నింగిలో మిగ్ గర్జనలు.. పర్యాటకుల హర్షధ్వానాలు!
రోడ్డుపై రన్వే..చైనాకు దగ్గర్లో మోదీ విమానం
డేగకన్ను పడిందంటే డ్రోన్ కూలాల్సిందే!
పేలిన విమానం ఇంజిన్.. 27 వేల అడుగుల ఎత్తులో టెన్షన్ !
45 పైసలకే రూ.10 లక్షల బీమా
ఈజిప్టు పిరమిడ్లలో తమిళ వ్యాపారి పేరు!
కుక్కర్ల గొడవ Vs ఓటర్ల తీర్పు! ఆ అభ్యర్థినే గెలిపించిన జనం!

