AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ లో అడుగంటిన జలాలు.. వాటర్ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిలో భూగర్భ జల మట్టాలు ప్రమాదకరంగా పడిపోవడంతో, ఇప్పటికే అనేక విద్యుత్ బోర్లు ఎండిపోవడంతో హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి హైదరాబాద్ ప్రజలకు సక్రమంగా నీటిని సరఫరా చేయలేకపోయింది. జంటనగరాల్లో గత కొన్ని వారాలుగా వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. రానున్న మూడు నెలల్లో ఉష్ణోగ్రతలు 43-450 సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది.

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ లో అడుగంటిన జలాలు.. వాటర్ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్
Telangana Water
Balu Jajala
|

Updated on: Mar 11, 2024 | 10:58 AM

Share

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిలో భూగర్భ జల మట్టాలు ప్రమాదకరంగా పడిపోవడంతో, ఇప్పటికే అనేక విద్యుత్ బోర్లు ఎండిపోవడంతో హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి హైదరాబాద్ ప్రజలకు సక్రమంగా నీటిని సరఫరా చేయలేకపోయింది. జంటనగరాల్లో గత కొన్ని వారాలుగా వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. రానున్న మూడు నెలల్లో ఉష్ణోగ్రతలు 43-450 సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ఫిబ్రవరిలో నగరంలో వాటర్ ట్యాంకర్లకు భారీ డిమాండ్ ఉంది.  2024 మార్చి నుంచి మే మధ్య వేసవి వేళ ఈ సంఖ్య పెరుగుతుందని, దీంతో మరిన్ని ట్యాంకర్లను అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

సాధారణంగా హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ వాటర్ ట్యాంకర్లకు ఏటా మార్చి రెండు లేదా మూడో వారం నుంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఈ ఏడాది బోరుబావులు ఎండిపోవడంతో ఫిబ్రవరి మూడో వారం నుంచే నగరంలో ట్యాంకర్లకు డిమాండ్ మొదలైంది. హిమాయత్సాగర్, సింగూరు, అక్కంపల్లి (నాగార్జునసాగర్), ఎల్లంపల్లి (గోదావరి)లో నీటిమట్టం తగ్గింది. ప్రస్తుతం హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీలో 580 వాటర్ ట్యాంకర్లు 5 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ పర్ డే) సరఫరా చేస్తున్నాయి. ఈ వేసవిలో అదనపు డిమాండ్ ను తీర్చేందుకు డిమాండ్ ఎక్కువగా ఉన్న చోట ప్రైవేటు ట్యాంకర్లను జలమండలి అద్దెకు తీసుకోనుంది. ఇక వాటర్ ఫిల్లింగ్ పాయింట్లను కూడా బోర్డు పెంచబోతోంది. ట్యాంకర్ డిమాండ్ ను తీర్చడానికి, అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే రెండు షిఫ్టులు పనిచేస్తున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు తమ ఇతర అవసరాల కోసం భూగర్భ జలాలపై ఆధారపడుతున్నారని అధికారులు తెలిపారు. ఇళ్లు, అపార్ట్ మెంట్స్,  విల్లాల్లో సరైన నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా కార్యాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్ లు, వాణిజ్య సంస్థలు లాంటివి కూడా తమ అవసరాల కోసం భూగర్భ జలాలపై ఆధారపడతారు. నీటి డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని గోదావరి, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ల నుంచి ఎక్కువ నీటిని ఎత్తిపోసి పైపుల ద్వారా నీటి సరఫరాను పెంచాలని హెచ్ ఎండబ్ల్యూఎస్ ఎస్ బీ యోచిస్తోంది. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ డొమెస్టిక్ ట్యాంకర్ ధర 5 వేల లీటర్ల నీటికి రూ.500, వాణిజ్య ట్యాంకర్ కు రూ.850 ఉండగా, ప్రైవేటు వాటర్ ట్యాంకర్లు రూ.1,200 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నాయి.