AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసులను చూసి అటు ఇటు తచ్చాడుతున్న సెక్యూరిటీ గార్డ్.. అనుమానంతో చెక్ చేయగా షాక్..!

హైదరాబాద్‌ మహానగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీసులు నిర్వహించిన దాడుల్లో కీలక విజయం సాధించారు. గంజాయి విక్రయిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డును అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులను చూసి అటు ఇటు తచ్చాడుతున్న సెక్యూరిటీ గార్డ్.. అనుమానంతో చెక్ చేయగా షాక్..!
Sot Police Raids In Gachibowli
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jun 11, 2026 | 11:45 AM

Share

హైదరాబాద్‌ మహానగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీసులు నిర్వహించిన దాడుల్లో కీలక విజయం సాధించారు. గంజాయి విక్రయిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డును అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గచ్చిబౌలిలోని విప్రో గేట్ సమీపంలో ఓ వ్యక్తి గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నాడన్న విశ్వసనీయ సమాచారం ఎస్‌వోటీ అధికారులకు అందింది. దీంతో ప్రత్యేక బృందం ఆ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసి, అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో అతడి వద్ద కేజీన్నర (1.5 కిలోల) గంజాయి లభ్యమైంది. అదనంగా గంజాయి విక్రయాలకు ఉపయోగిస్తున్నట్లు భావిస్తున్న ఒక మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో నిందితుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో అతడు ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని సేకరించి హైదరాబాద్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. నగరంలోని యువతను లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడుతున్నాడా? లేదా అతడి వెనుక మరింత పెద్ద నెట్‌వర్క్ ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అరెస్టు చేసిన నిందితుడిని తదుపరి విచారణ కోసం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నగరంలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల సరఫరా వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక బృందాలు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా మాదకద్రవ్యాల విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us