AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. ప్రమాణస్వీకారానికి హాజరుకావాలంటూ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. నిన్న సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని నియమించారు. రేపు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు రేవంత్. ఈయనతో పాటూ మరో 18 మంది మంత్రులుగా కూడా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎల్బీ నగర్ లో ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఉన్నతాధికారులు.

Revanth Reddy: తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. ప్రమాణస్వీకారానికి హాజరుకావాలంటూ..
Revanth Reddy Has Send An Invitation Letter To The People Of Telangana To Come Swearing Ceremony At Lb Stadium, Hyderabad.
Srikar T
|

Updated on: Dec 06, 2023 | 5:29 PM

Share

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. నిన్న సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని నియమించారు. రేపు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు రేవంత్. ఈయనతో పాటూ 18 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు ఉన్నతాధికారులు. అయితే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి లేఖ ద్వారా ఆహ్వానం పంపారు.

ఈ లేఖలో ముందుగా ‘తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనీయా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శకపాలన అందించేందుకు.. బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రజల ఆశీస్సులు కావాలన్నారు. అందుకే 2023, డిశంబర్ 7న మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయబోతోంది అని సందేశాన్ని ఇచ్చారు. ఈ మహోత్సవానికి ప్రజలందరూ రావల్సిందిగా ఇదే నా ఆహ్వానం’ అని లేఖలో చివరగా జోడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..