
నుదుటన తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలి, శుక్లాం భరతరంతోనే క్లాసులు మొదలవ్వాలి, హనుమాన్ చాలీసా చదివాకే పరీక్షలు రాయాలి..! రాబోయే రోజుల్లో స్కూళ్లు, కాలేజీల్లో ఇటువంటి కండిషన్లు రాబోతున్నాయా? వినడానికి విచిత్రంగా అనిపించొచ్చు. కానీ, తెలంగాణలో ఇటువంటి సిగ్నల్సే క్లియర్గా వినిపించాయి. ఇక్కడ విద్యా జిహాద్ నడుస్తోంది.. స్కూల్ పిల్లలకు ఖురాన్ పాఠాలు నేర్పిస్తున్నారు.. అని గగ్గోలు పెడుతున్న కొన్ని పార్టీలు.. తమ ఫ్యూచర్ ప్లాన్లను ఇలా రాసేసుకున్నాయి. ఇంతటి అతివాదం ఎందుకొచ్చినట్టు..? పాతబస్తీలో జరిగిన ఒక ఉదంతం.. జిహాద్ టాపిక్ని సీరియస్గా మార్చేసింది. బార్డర్లు దాటి బరితెగిస్తున్న జిహాదీల సబ్జెక్ట్ని జనంలోకి లోతుగా తీసుకెళ్లి జరభద్రం అని హెచ్చరిస్తోంది మాయమాటలతో అమ్మాయిలకు వలవేసి, హనీట్రాప్ చేసి, పెళ్లిదాకా తీసుకొచ్చి మతం మార్పించి, తర్వాత గాలికి వదిలేయడం. దీనికున్న ముద్దుపేరు లవ్ జిహాద్. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే గత మూడేళ్లలో 500కు పైగా ఇటువంటి లవ్ జిహాద్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇక, మహారాష్ట్ర లోని నాసిక్ TCS క్యాంపస్లో వలపు వల విసిరి మాస్ కన్వర్షన్స్కి పాల్పడింది ఒక గుంపు. మొత్తం ఐటీ సెక్టార్నే వణికించేసిన ఉదంతమిది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ముస్లిం మహిళలే మీడియేటర్లుగా అబ్బాయిలను ఉసిగొల్పిన దారుణమిది. హిజాబ్ తొడిగించి, ఖురాన్ చదివించి, పక్కా వెజిటేరియన్లతోనే...