తప్పటడుగు వేసి పార్టీ మారా.. కాంగ్రెస్‌ పార్టీలో చేరి పెద్ద తప్పు చేశాః గూడెం మహిపాల్ రెడ్డి

ఆ ఎమ్మెల్యే ఎటు వైపు ఉన్నారన్నది కొద్దిరోజుల క్రితం వరకు జరిగిన చర్చ. ఆయన విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పుతో ఇక ఆయన అధికార పార్టీలోనే ఉంటారని అంతా అనుకున్నారు. కానీ పార్టీ మారినా ఆయన చూపంతా పాత గూటిపైనే ఉందన్న వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టే ఆ ఎమ్మెల్యే చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి.

తప్పటడుగు వేసి పార్టీ మారా.. కాంగ్రెస్‌ పార్టీలో చేరి పెద్ద తప్పు చేశాః గూడెం మహిపాల్ రెడ్డి
Gudem Mahipal Reddy

Updated on: Jan 18, 2026 | 9:28 PM

ఆ ఎమ్మెల్యే ఎటు వైపు ఉన్నారన్నది కొద్దిరోజుల క్రితం వరకు జరిగిన చర్చ. ఆయన విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పుతో ఇక ఆయన అధికార పార్టీలోనే ఉంటారని అంతా అనుకున్నారు. కానీ పార్టీ మారినా ఆయన చూపంతా పాత గూటిపైనే ఉందన్న వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టే ఆ ఎమ్మెల్యే చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి.

అయితే త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్న వేళ గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.. BRS పార్టీని వీడి తప్పు చేశానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరిస్థితిలో తప్పటడుగు వేసి కాంగ్రెస్‌లో చేరానని.. అయితే కాంగ్రెస్‌లో తనకు, నియోజకవర్గానికి వెంట్రుక వంతు లాభం కూడా జరగలేదని కామెంట్ చేశారు. మూడుసార్లు BRS నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని.. మున్సిపల్ ఎన్నికల్లో BRS అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు.

తెలంగాణలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. టెక్నికల్‌గా వాళ్లు కారు పార్టీ ఎమ్మెల్యేలే అని స్పీకర్ తీర్పు ఇచ్చినా.. వారిలో చాలామంది హస్తం పార్టీతోనే రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఆ ఎమ్మెల్యేల జాబితాలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఉన్నారు. బీఆర్ఎస్‌ తరపున మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి.. కొన్ని నెలల క్రితమే మిగతా ఎమ్మెల్యేల తరహాలోనే పార్టీ మారారు. అయితే కాంగ్రెస్‌ నేతలతో సఖ్యత కుదరలేదు. గతంలో ఓసారి గూడెం వర్గీయులకు పటాన్‌చెరు కాంగ్రెస్ నాయకులకు మధ్య పెద్ద గొడవ కూడా జరిగింది. దీనిపై టీపీసీసీలో ఒకరికొకరు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో ఉంటున్నా.. అధికార పార్టీతో మహిపాల్ రెడ్డి అంటీముట్టనట్టుగానే ఉంటూ వచ్చారు.

ఈ క్రమంలో మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ కోసం కాకుండా బీఆర్ఎస్ కోసం పని చేసేందుకు సిద్ధమయ్యారా ? అనే చర్చ జరుగుతోంది. దీంతో మళ్లీ ఆయన సొంత గూటికి చేరుకునేందుకు సిద్ధమవుతున్నారా ? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..