MLC Kavitha: ఈడీ నోటీసులపై మరోసారి సుప్రీంకోర్టుకు ఎమ్మెల్సీ కవిత.. వెంటనే..

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ స్కీమ్‌లో ఎమ్మెల్సీ కవిత మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టనున్నారు. శుక్రవారమే (మార్చి 17) తాము దాఖలు చేసిన పిటీషన్ పై అత్యవసర విచారణ జరపాలని కవిత తరపు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానాన్ని కోరనున్నారు

MLC Kavitha: ఈడీ నోటీసులపై మరోసారి సుప్రీంకోర్టుకు ఎమ్మెల్సీ కవిత.. వెంటనే..
MLC Kavitha
Follow us

|

Updated on: Mar 16, 2023 | 8:39 PM

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ స్కీమ్‌లో ఎమ్మెల్సీ కవిత మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టనున్నారు. శుక్రవారమే (మార్చి 17) తాము దాఖలు చేసిన పిటీషన్ పై అత్యవసర విచారణ జరపాలని కవిత తరపు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానాన్ని కోరనున్నారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం (మార్చి 20 తేదీన) విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ ధర్మాసనం ముందు అత్యవసర విచారణకు ప్రస్తావన చేయనున్నారు కవిత తరపు న్యాయవాదులు. కాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఒక మహిళను ఈడీ విచారణకు పిలుస్తోందని ఇది పూర్తిగా చట్టానికి విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కవిత తరుఫున న్యాయవాదులు వివరించారు. ఫోన్‌ సీజ్ వ్యవహారాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు కవిత. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై కవిత పిటిషన్‌ దాఖలు చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని.. కానీ అలా చేయలేదని కవిత పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొబైల్‌ ఫోన్లు సీజ్‌చేశారని కోర్టు దృష్టికి కవిత తీసుకెళ్లారు. సీఆర్పీసీ సెక్షన్‌ 160 ప్రకారం ఓ మహిళను ఆమె ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉన్నా.. ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇవాల్టి విచారణ నుంచి కూడా మినహాయింపు కోరారు కవిత. అయితే ఈ కేసులో కవితకు కోర్టు నుంచి చుక్కెదురైంది. మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాదు ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం మార్చి 24కు వాయిదా వేసింది.

కాగా లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఢిల్లీలోనే ఉన్న ఆమె అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోతున్నానని.. మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానం ఇదే అంటూ తన ప్రతినిధితో ఈడీ అధికారులకు లేఖ పంపారు. దీంతో కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది ఈడీ. 20న విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..