Telugu News Telangana Minister KTR Fires on Congress and BJP Parties over Telangana Development
Minister KTR: జర ఆలోచించండి.. ఢిల్లీ పార్టీలను నమ్మొద్దు.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
ప్రజలను కడుపులో పెట్టుకొని చూసే KCR కావాలా? కుంభకోణాలా కాంగ్రెస్ కావాలా.. తేల్చుకోవాలంటూ మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. తండ్రి వయస్సున్న KCR గురించి అడ్డుగోలుగా మాట్లాడే ఎంపీ అర్వింద్ నిజామాబాద్ను ఏమైనా అభివృద్ధి చేశారా..? నిజామాబాద్ ప్రజలు ఆలోచించాలంటూ కేటీఆర్ వివరించారు.
నిజామాబాద్, ఆగస్టు 9: ప్రజలను కడుపులో పెట్టుకొని చూసే KCR కావాలా? కుంభకోణాలా కాంగ్రెస్ కావాలా.. తేల్చుకోవాలంటూ మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. తండ్రి వయస్సున్న KCR గురించి అడ్డుగోలుగా మాట్లాడే ఎంపీ అర్వింద్ నిజామాబాద్ను ఏమైనా అభివృద్ధి చేశారా..? నిజామాబాద్ ప్రజలు ఆలోచించాలంటూ కేటీఆర్ వివరించారు. నిజామాబాద్లో నిర్మించిన ఐటీహబ్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి KTR బుధవారం ప్రారంభించారు. ఐటీ హబ్ను పరిశీలించిన కొత్తగా నియమితులైన ఉద్యోగులతో కాసేపు మాట్లాడారు. 50 కోట్ల రూపాయలతో 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ హబ్ను నిర్మించారు. ఐటీ యువత ఆశలు, ఆకాంక్షలకు ప్రతిబింబిమని కేటీఆర్ అన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐటీ టవర్, న్యాక్ భవనాన్ని మరియు పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి @KTRBRS ప్రసంగించారు. pic.twitter.com/X8GALfmYvN
ఆ తర్వాత నిజామాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన KTR రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. KCRను అనే స్థాయి నిజామాబాద్ ఎంపీకి ఉందా అని ప్రశ్నించారు. ఎంపీగా నిజామాబాద్కు ఏమైనా అభివృద్ధి చేశారా అని నిలదీశారు. అటు, TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కూడా మంత్రి కే తారక రామారావు ఘాటు విమర్శలు చేశారు. 50 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా మోసం చేసేందుకు యత్నిస్తోందని KTR మండిపడ్డారు.
పట్టణాల్లో ఉండే ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే లక్ష్యంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రధాన చెరువులను మినీ ట్యాంక్ బండ్ లుగా అభివృద్ధి చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.
ఇందులో భాగంగా నిజామాబాద్ నగరంలో ₹14 కోట్లతో అభివృద్ధి చేసిన చారిత్రక బొడ్డెమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ ను మంత్రులు… pic.twitter.com/8Jaq2NLEkf
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 9, 2023
ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని కేటీఆర్ అన్నారు. మూడు పంటలకు నీళ్లిచ్చే KCR కావాలా? మూడు గంటల కరెంట్ ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్ కావాలా తేల్చుకోవాలని ప్రజలను KTR కోరారు. ఢిల్లీ పార్టీ నాయకులు కూర్చొవాలన్నా, నిలబడాలన్నా ఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకోవాలని, కాని తమ పార్టీ బాసులు తెలంగాణ గల్లీల్లో ఉన్నారని KTR అన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ రోడ్లు మరియు భవనాల శాఖ నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ – జిల్లా నైపుణ్య అభివృద్ధి కేంద్ర భవనాన్ని మంత్రులు @VPR_BRS, @KTRBRS ప్రారంభించారు. pic.twitter.com/UZEK2MKIZz
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 9, 2023