Harassment Case: మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళితే.. హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ బ్రాంచ్ శ్రీచైతన్య కాలేజీలో మైనర్ బాలికపై కాలేజీకి చెందిన వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత విద్యార్థిని విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో.. వారు పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థిని తండ్రి ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతరు పట్ల కళాశాలకు చెందిన ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎల్బీ నగర్ పోలీసులు సదరు వ్యక్తిపై ఫోక్సో చట్టం(సెక్షన్ 354 ఐపీసీ 11 ఆర్/డబ్ల్యూ 12) కింద కేసుు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనపై విచారణ చేస్తున్నారు.
Also read: