బోర్డుకు బాధ్యత లేదా?.. కోమటిరెడ్డి ఫైర్

|

Apr 22, 2019 | 4:53 PM

నల్గొండ : తెలంగాణ ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యంపై కాంగ్రెస్‌ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రభుత్వం లేదనడానికి ఇంటర్ ఫలితాలే నిదర్శనమని, ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు ఫెయిల్యూర్‌పై సీఎం కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి,  తమ జిల్లా వ్యక్తి కావడం సిగ్గుచేటన్నారు. ఆయనను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చెయ్యాలని […]

బోర్డుకు బాధ్యత లేదా?.. కోమటిరెడ్డి ఫైర్
Follow us on

నల్గొండ : తెలంగాణ ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యంపై కాంగ్రెస్‌ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రభుత్వం లేదనడానికి ఇంటర్ ఫలితాలే నిదర్శనమని, ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు ఫెయిల్యూర్‌పై సీఎం కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి,  తమ జిల్లా వ్యక్తి కావడం సిగ్గుచేటన్నారు. ఆయనను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. రెవెన్యూశాఖను ముఖ్యమంత్రి వద్ద ఉంచుకొని అవినీతి జరుగుతుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. రెవిన్యూ శాఖ మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఏమీకాదని స్పష్టం చేశారు.